హైదరాబాద్ కూకట్పల్లి బాలాజీనగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో పూర్వ విద్యార్థుల సాయంతో దిగువ స్థాయి సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. తాము చదువుకున్న విద్యాలయంలో సిబ్బంది వరదలు, లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న విద్యార్థులు తమ వంతు సాయం చేశారు.
2008- 2009లో పదో తరగతి చదివిన విద్యార్థులంతా కలిసి పాఠశాలలో పనిచేస్తున్న డ్రైవర్లకు, ఆయాలకు నిత్యావసరాలు అందించారు. తాము చదువుకున్న విద్యాలయంలో సిబ్బందికి సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు పూర్వ విద్యార్థులు.
ఇదీ చూడండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి