ETV Bharat / state

'రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలే లేవు' - మిషన్​ భగీరథ వల్ల సున్నాకు చేరుకున్న ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలు

తెలంగాణలో మిషన్​ భగీరథ అమలు వల్ల ప్రస్తుతం ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలు సున్నాకు చేరుకున్నాయని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందంటూ ఆయన ట్విటర్​ వేదికగా తెలిపారు.

central government approved that telangana has zero fluoride effected villages
మిషన్​ భగీరథ వల్ల సున్నాకు చేరుకున్న ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలు
author img

By

Published : Sep 18, 2020, 10:40 AM IST

Updated : Sep 18, 2020, 10:49 AM IST

మిషన్​ భగీరథ అమలుతో రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలే లేవని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 967 ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలు ఉండేవని.. మిషన్​ భగీరథను విజయవంతంగా అమలుచేయడం వల్ల ఇప్పుడు ఆ సంఖ్య సున్నాకు చేరుకుందని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందంటూ ఆయన ట్విటర్​ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ఆయన ట్వీట్​ చేశారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలు లేకుండా కృషి చేసిన మిషన్​ భగీరథ బృందానికి మంత్రి కేటీఆర్​ అభినందనలు తెలిపారు.

మిషన్​ భగీరథ అమలుతో రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలే లేవని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 967 ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలు ఉండేవని.. మిషన్​ భగీరథను విజయవంతంగా అమలుచేయడం వల్ల ఇప్పుడు ఆ సంఖ్య సున్నాకు చేరుకుందని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిందంటూ ఆయన ట్విటర్​ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ఆయన ట్వీట్​ చేశారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్​ ప్రభావిత గ్రామాలు లేకుండా కృషి చేసిన మిషన్​ భగీరథ బృందానికి మంత్రి కేటీఆర్​ అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండిః కరోనా కారణంగా పరిమితంగానే బస్సు సర్వీసులు

Last Updated : Sep 18, 2020, 10:49 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.