ETV Bharat / state

'సీబీఐపై నమ్మకం లేదు.. కవితను బహిరంగంగా విచారించాలి'

author img

By

Published : Dec 11, 2022, 5:17 PM IST

Koonanni reaction to CBI investigation on Kavitha: ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ మీడియా ఎదుటగా బహిరంగంగా విచారించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్​ చేశారు. సీబీఐ విచారణపై తమకు నమ్మకం లేదని.. బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

Koonanni Sambasiva Rao
Koonanni Sambasiva Rao

Koonanni reaction to CBI investigation on Kavitha: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న సీబీఐ విచారణపై వామపక్ష నాయకులు స్పందిస్తున్నారు. కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ బహిరంగంగా జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్​ చేశారు. సీబీఐపై తమకు నమ్మకం లేదని మీడియా ఎదుట కవితను విచారించాలని పేర్కొన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అధికారులు రాష్ట్రంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో దాడులు చేసి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోందని కూనంనేని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక టీఆర్​ఎస్​ నాయకుడిపై ఐటీ దాడులు చేయిస్తూ తద్వారా బీజేపీలోకి చేర్చుకునే కుట్ర చేస్తోందని కేంద్రంపై ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు. దిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ పతనం ప్రారంభమైందని కూనంనేని జోస్యం చేశారు.

CPI Narayana reacts to the CBI investigation on Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై జరుగుతున్న సీబీఐ విచారణను ప్రత్యక్ష ప్రసారం పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలు సైతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని.. సీబీఐ విచారణ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడంలో ఇబ్బంది ఏముందని ఆయన ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Koonanni reaction to CBI investigation on Kavitha: దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న సీబీఐ విచారణపై వామపక్ష నాయకులు స్పందిస్తున్నారు. కవితపై జరుగుతున్న సీబీఐ విచారణ బహిరంగంగా జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్​ చేశారు. సీబీఐపై తమకు నమ్మకం లేదని మీడియా ఎదుట కవితను విచారించాలని పేర్కొన్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అధికారులు రాష్ట్రంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో దాడులు చేసి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోందని కూనంనేని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక టీఆర్​ఎస్​ నాయకుడిపై ఐటీ దాడులు చేయిస్తూ తద్వారా బీజేపీలోకి చేర్చుకునే కుట్ర చేస్తోందని కేంద్రంపై ఆరోపణలు చేశారు. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయని అన్నారు. దిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓటమితో బీజేపీ పతనం ప్రారంభమైందని కూనంనేని జోస్యం చేశారు.

CPI Narayana reacts to the CBI investigation on Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై జరుగుతున్న సీబీఐ విచారణను ప్రత్యక్ష ప్రసారం పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలు సైతం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల చర్చలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని.. సీబీఐ విచారణ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడంలో ఇబ్బంది ఏముందని ఆయన ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.