ETV Bharat / state

పోరుబందర్ నుంచి దిల్లీ వరకు సైకిల్ యాత్ర - మహాత్మ గాంధీ

గాంధీజీ ఆశయాలను యువతకు చేరవేసే ఉద్దేశంతో... బాపూజీ స్వస్థలమైన పోర్‌బందర్‌ నుంచి దిల్లీ రాజ్‌ఘాట్‌ వరకు సైకిల్ యాత్ర చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.

పోరుబందర్ నుంచి దిల్లీ వరకు సైకిల్ యాత్ర
author img

By

Published : Sep 6, 2019, 12:21 PM IST

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. గాంధీజీ ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఏపీఎఫ్‌ ఆధ్వర్యంలో 5 వేల మందితో 2 వేల కిలో మీటర్ల మేర సైకిల్‌ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. రేపు ఉదయం 9 గంటలకు పోర్‌బందర్‌ వద్ద ఈ యాత్రను స్వయంగా తానే ప్రారంభిస్తానని... అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నాటికి దిల్లీ రాజ్‌ఘాట్‌ చేరుకుంటామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. యాత్రలో పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు.

పోరుబందర్ నుంచి దిల్లీ వరకు సైకిల్ యాత్ర

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. గాంధీజీ ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఏపీఎఫ్‌ ఆధ్వర్యంలో 5 వేల మందితో 2 వేల కిలో మీటర్ల మేర సైకిల్‌ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. రేపు ఉదయం 9 గంటలకు పోర్‌బందర్‌ వద్ద ఈ యాత్రను స్వయంగా తానే ప్రారంభిస్తానని... అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నాటికి దిల్లీ రాజ్‌ఘాట్‌ చేరుకుంటామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. యాత్రలో పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు.

పోరుబందర్ నుంచి దిల్లీ వరకు సైకిల్ యాత్ర

ఇవీ చూడండి: కుషాయిగూడ చోరీ కేసు.. బిహార్​లో నలుగురు దొంగల అరెస్ట్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.