ఇవీ చూడండి:శరత్... నేను కేసీఆర్ను మాట్లాడుతున్నా...!
నిజాయతీపరులా, రౌడీలా అనేది ప్రజలే నిర్ణయిస్తారు - మీ అభివృద్ధిలో భాగమవుతా: కిషన్ రెడ్డి
నిజాయతీపరులను గెలిపిస్తారో, రౌడీలను గెలిపిస్తారో ప్రజలే నిర్ణయిస్తారని సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాసేవకుడు, చౌకిదార్ మోదీ నాయకత్వంలో దేశం మరింత పురోగతి సాధిస్తుందని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి తనను గెలిపిస్తే.. ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్ నామాలగుండులోని వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి భాజపా అభ్యర్థి కిషన్రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముఖ్య నాయకులు, కార్యకర్తల ఇంటింటికి వెళ్లి కలిశారు. ఈ ఎన్నికలు చాలా కీలకమని, దేశంలో మోదీ మరోసారి ప్రధాని కావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమన్నారు.
ఇవీ చూడండి:శరత్... నేను కేసీఆర్ను మాట్లాడుతున్నా...!
sample description