యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు సికింద్రాబాద్ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్. ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, అడిక్మెట్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నాయిని, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగడానికి రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లోతెరాసను గెలిపించాల్సినఅవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని సాయికిరణ్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:'ఎన్నికలు ఉన్నా.. లేకున్నా.. మీవెంటే ఉంటాం'