ఆర్టీసీ కార్మికులు 44 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. హైదరాబాద్ భోలక్పూర్లోని భవాని శంకర్ దేవాలయంలో కార్తికదీపొత్సవ ఏర్పాట్లును పరిశీలించారు. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా వైఖరి మారాలేదన్నారు. రాజకీయ పార్టీలు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు శవ రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: పెద్దల సభకు పెద్ద పండగ.. రేపే రాజ్యసభ 250వ సమావేశం