ETV Bharat / state

జూన్​ 8 నుంచి శ్రీవారి దర్శనం : వైవీ. సుబ్బారెడ్డి

author img

By

Published : Jun 5, 2020, 3:37 PM IST

ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మకంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శనాన్ని ప్రారంభిస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. 8, 9 తేదీలలో తితిదే ఉద్యోగులు దర్శనం చేసుకుంటారని.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులతో దర్శనాల ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని.. 65 ఏళ్లు పైబడినవారికి, పిల్లలకు దర్శనాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు.

June Eightth onwards to Thirumala temple Darshanam for Devotees said by YV Subbareddy
జూన్​ 8 నుంచి శ్రీవారి దర్శనం : వైవీ. సుబ్బారెడ్డి

8వ తేదీ నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం...

ఈ నెల 8వ తేదీ నుంచి తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి ద‌ర్శనాన్ని ప్రారంభిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. సుమారు 3 వేలమందికి ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం కల్పిస్తామని... కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దొని స్పష్టం చేశారు.

గంటకు 500 మందికి మాత్రమే అనుమతి..

ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందని ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని అన్నారు. వసతి గదుల్లో ఒక్కరోజే మాత్రమే భక్తులకు అనుమతినిస్తామని.. ఒక్కో గదిలో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. క్యూలైన్లలో ప్రతి 2 గంటలకు ఒకసారి శానిటైజేషన్‌ ఉంటుందని... 500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చే అవకాశముందని తెలిపారు.

గంటకు 500 మందికి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లు మారుస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి లేదని... తితిదే అనుబంధ ఆలయాల్లో కూడా పరిమితంగానే అనుమతులుంటాయని సింఘాల్ తెలియజేశారు.

ఆలయంలో ప్రత్యేకంగా అధునాతన కెమెరాబేస్డ్‌ థర్మల్‌ స్కానింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. అలిపిరి టోల్‌గేట్‌తో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా భక్తులు క్యూలైన్లలోకి వెళ్లే రెండు మార్గాల్లో థర్మల్‌ స్కానింగ్‌ యంత్రాలు అమర్చనున్నారు.

ఇదీచూడండి : తిరుమలలో రెండోరోజు వైభవంగా జ్యేష్ఠాభిషేకం

8వ తేదీ నుంచి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం...

ఈ నెల 8వ తేదీ నుంచి తిరుమల శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా శ్రీవారి ద‌ర్శనాన్ని ప్రారంభిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా వచ్చే భక్తులకు ఈ నెల 11 నుంచి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు. సుమారు 3 వేలమందికి ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం కల్పిస్తామని... కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి భక్తులు దర్శనానికి రావద్దొని స్పష్టం చేశారు.

గంటకు 500 మందికి మాత్రమే అనుమతి..

ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమవుతుందని ఆలయ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని అన్నారు. వసతి గదుల్లో ఒక్కరోజే మాత్రమే భక్తులకు అనుమతినిస్తామని.. ఒక్కో గదిలో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. క్యూలైన్లలో ప్రతి 2 గంటలకు ఒకసారి శానిటైజేషన్‌ ఉంటుందని... 500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చే అవకాశముందని తెలిపారు.

గంటకు 500 మందికి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి 2 గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లు మారుస్తామని స్పష్టం చేశారు. తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి లేదని... తితిదే అనుబంధ ఆలయాల్లో కూడా పరిమితంగానే అనుమతులుంటాయని సింఘాల్ తెలియజేశారు.

ఆలయంలో ప్రత్యేకంగా అధునాతన కెమెరాబేస్డ్‌ థర్మల్‌ స్కానింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశామన్నారు. అలిపిరి టోల్‌గేట్‌తో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా భక్తులు క్యూలైన్లలోకి వెళ్లే రెండు మార్గాల్లో థర్మల్‌ స్కానింగ్‌ యంత్రాలు అమర్చనున్నారు.

ఇదీచూడండి : తిరుమలలో రెండోరోజు వైభవంగా జ్యేష్ఠాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.