ETV Bharat / state

"జో జిల్లా'' టన్నెల్‌ టెండర్లు దక్కించుకున్న ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌

author img

By

Published : Aug 22, 2020, 11:14 AM IST

జమ్ము కశ్మీర్‌ - లద్దాఖ్‌లోని "జో జిల్లా'' పాస్‌ టన్నెల్‌ టెండర్లు తమకే దక్కాయని జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌-ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ ప్రకటించింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ నిర్మాణ పనుల టెండర్​ కొటేషన్​లో తమ సంస్థ మొదటి స్థానంలో నిలవడం వల్ల తమకే ఆ కాంట్రాక్ట్ పనులు దక్కాయని వెల్లడించింది.

"జో జిల్లా'' పాస్‌ టన్నెల్‌ టెండర్లు తమకే దక్కాయి : ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌
"జో జిల్లా'' పాస్‌ టన్నెల్‌ టెండర్లు తమకే దక్కాయి : ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌

జమ్ము కశ్మీర్‌-లద్దాఖ్‌లోని "జో జిల్లా'' పాస్‌ టన్నెల్‌ టెండర్లు తమకే దక్కాయని జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌-ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ తెలియచేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ నిర్మాణ పనుల కోసం గత నెల 30న తమతో పాటు మరో మూడు సంస్థలు బిడ్‌లు వేసినట్లు తెలిపింది.

మొదటి స్థానం...

టెండర్​ కొటేషన్​లో తమ సంస్థ మొదటి స్థానంలో నిలవడం వల్ల తమకే ఆ కాంట్రాక్ట్ పనులు దక్కాయని వెల్లడించింది. ఇతర రెండు సంస్థల కంటే తక్కువ ధర రూ.4509.5 కోట్లు మొత్తానికి కోట్‌ చేయడంతో తమ సంస్థ మొదటి స్థానంలో నిలిచిందని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ వెల్లడించింది.

రెండు నిర్మించాల్సి ఉంది...

మొత్తం 33 కిలోమీటర్లు మేర టన్నెల్స్‌తో కూడిన రహదారిని నిర్మించాల్సి ఉందని వివరించింది. ఇందులో రెండు భాగాలు ఉండగా.. మొదటి భాగం 18.5 కిలోమీటర్లు పొడవు రహదారి కాగా అందులో 2 కిలోమీటర్లు ఒకటి, అర కిలోమీటర్ మరొకటి రెండు టన్నెల్స్ నిర్మించనున్నట్లు చెప్పుకొచ్చింది. రెండో భాగంలో 9.5 మీటర్లు వెడల్పు, 7.57 మీటర్లు ఎత్తు పద్ధతిలో గుర్రపు నాడా ఆకారంలో 14.15 కిలోమీటర్లు మేర రహదారిని నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో...

ఇంతవరకు దేశంలో ఎక్కడ లేని విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం నిర్మాణ పనులను చేపట్టాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ తెలిపింది. జమ్ము కశ్మీర్‌, శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్, లేహ్‌ రహదారి పొడవునా.. వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా లేదని వివరించింది. ముఖ్యంగా శీతాకాలంలో మొత్తం ఆరు నెలలపాటు శ్రీనగర్‌-లద్దాఖ్‌ రహదారిని పూర్తిగా మూసివేస్తారన్నారు. ఫలితంగా మిలిటరీ సంబంధించిన వాహనాలూ వెళ్లలేకపోయాయని గుర్తు చేసింది.

అధిక దూరమవుతోంది...

ప్రత్యామ్నాయ మార్గాలు నుంచి రాకపోకలు సాగించేందుకు అధిక దూరమవుతోందని జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, మంచు తుఫాన్‌లు తలెత్తినా ఎలాంటి ప్రమాదం లేకుండా క్యాచ్‌ డ్యామ్‌, ఎయిర్‌ ప్రొటెక్షన్‌ గోడలు తదితరాలు పూర్తి చేయాల్సి ఉందని వివరించింది. ఏ పరిస్థితులనైనా తట్టుకునేందుకు వీలుగా నిర్మాణం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఇవీ చూడండి : నిండుకుండలా ఎల్​ఎండీ... చూసేందుకు పర్యటకుల తాకిడి

జమ్ము కశ్మీర్‌-లద్దాఖ్‌లోని "జో జిల్లా'' పాస్‌ టన్నెల్‌ టెండర్లు తమకే దక్కాయని జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌-ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ తెలియచేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ నిర్మాణ పనుల కోసం గత నెల 30న తమతో పాటు మరో మూడు సంస్థలు బిడ్‌లు వేసినట్లు తెలిపింది.

మొదటి స్థానం...

టెండర్​ కొటేషన్​లో తమ సంస్థ మొదటి స్థానంలో నిలవడం వల్ల తమకే ఆ కాంట్రాక్ట్ పనులు దక్కాయని వెల్లడించింది. ఇతర రెండు సంస్థల కంటే తక్కువ ధర రూ.4509.5 కోట్లు మొత్తానికి కోట్‌ చేయడంతో తమ సంస్థ మొదటి స్థానంలో నిలిచిందని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ వెల్లడించింది.

రెండు నిర్మించాల్సి ఉంది...

మొత్తం 33 కిలోమీటర్లు మేర టన్నెల్స్‌తో కూడిన రహదారిని నిర్మించాల్సి ఉందని వివరించింది. ఇందులో రెండు భాగాలు ఉండగా.. మొదటి భాగం 18.5 కిలోమీటర్లు పొడవు రహదారి కాగా అందులో 2 కిలోమీటర్లు ఒకటి, అర కిలోమీటర్ మరొకటి రెండు టన్నెల్స్ నిర్మించనున్నట్లు చెప్పుకొచ్చింది. రెండో భాగంలో 9.5 మీటర్లు వెడల్పు, 7.57 మీటర్లు ఎత్తు పద్ధతిలో గుర్రపు నాడా ఆకారంలో 14.15 కిలోమీటర్లు మేర రహదారిని నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొంది.

ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో...

ఇంతవరకు దేశంలో ఎక్కడ లేని విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం నిర్మాణ పనులను చేపట్టాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ తెలిపింది. జమ్ము కశ్మీర్‌, శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్, లేహ్‌ రహదారి పొడవునా.. వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా లేదని వివరించింది. ముఖ్యంగా శీతాకాలంలో మొత్తం ఆరు నెలలపాటు శ్రీనగర్‌-లద్దాఖ్‌ రహదారిని పూర్తిగా మూసివేస్తారన్నారు. ఫలితంగా మిలిటరీ సంబంధించిన వాహనాలూ వెళ్లలేకపోయాయని గుర్తు చేసింది.

అధిక దూరమవుతోంది...

ప్రత్యామ్నాయ మార్గాలు నుంచి రాకపోకలు సాగించేందుకు అధిక దూరమవుతోందని జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్ స్పష్టం చేసింది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, మంచు తుఫాన్‌లు తలెత్తినా ఎలాంటి ప్రమాదం లేకుండా క్యాచ్‌ డ్యామ్‌, ఎయిర్‌ ప్రొటెక్షన్‌ గోడలు తదితరాలు పూర్తి చేయాల్సి ఉందని వివరించింది. ఏ పరిస్థితులనైనా తట్టుకునేందుకు వీలుగా నిర్మాణం చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఇవీ చూడండి : నిండుకుండలా ఎల్​ఎండీ... చూసేందుకు పర్యటకుల తాకిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.