ETV Bharat / state

Huzurabad By elections: 'తెరాస ఓడిపోతుందనడానికి అదే నిదర్శనం' - former mp jithender reddy latest news

మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​పై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారాలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హుజూరాబాద్​ ఉప ఎన్నికల భాజపా ఇంఛార్జీ జితేందర్​రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్​ స్వయంగా మానిటరింగ్​ చేయటమే తెరాస ఓడిపోతుందనడానికి నిదర్శనమన్నారు. ముఖ్య నేతలతో సమావేశం కారణంగా ఈటల రాజేందర్‌ ప్రజా దీవెన పాదయాత్రకు రేపు ఒక్క రోజు విరామం ఇస్తునట్లు ఆయన చెప్పారు.

'తెరాస ఓడిపోతుందనడానికి అదే నిదర్శనం'
'తెరాస ఓడిపోతుందనడానికి అదే నిదర్శనం'
author img

By

Published : Jul 30, 2021, 7:21 PM IST

'తెరాస ఓడిపోతుందనడానికి అదే నిదర్శనం'

ఈటల రాజేందర్‌కు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల భాజపా ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా మానిటరింగ్‌ చేయటమే తెరాస ఓడిపోతుందనడానికి నిదర్శనమన్నారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం తీసుకొచ్చారని ఆరోపించారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈటల రాజేందర్​పై అసత్యాలు ప్రచారాలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జితేందర్​రెడ్డి తెలిపారు. ముఖ్య నేతలతో సమావేశం కారణంగా ఈటల రాజేందర్‌ ప్రజా దీవెన పాదయాత్రకు రేపు ఒక్క రోజు విరామం ఇస్తునట్లు చెప్పారు. ఎల్లుండి నుంచి పాదయాత్ర మరింత ఉద్ధృతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

హుజూరాబాద్​ బై ఎలక్షన్​లో ఈటల రాజేందర్​కు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇది నీ ఒక్కడి ఆత్మగౌరవ పోరాటం కాదు.. హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలందరిది అంటూ మద్దతిస్తున్నారు. ఈరోజు కేసీఆర్​ భయపడి ఫామ్​హౌస్​ను వదిలి.. ప్రగతిభవన్​లో కూర్చుని రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఈటల రాజేందర్​పై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్య నేతల సమావేశం కారణంగా ఈటల రాజేందర్​ రేపు ఒక్కరోజు పాదయాత్రకు విరామం తీసుకుంటున్నారు. ఎల్లుండి నుంచి తిరిగి పోరు కొనసాగుతుంది.-జితేందర్​రెడ్డి, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల భాజపా ఇంఛార్జీ

ఇదీ చూడండి: Huzurabad By elections: హుజూరాబాద్​ బరిలో 800 ఎంపీటీసీలు

'తెరాస ఓడిపోతుందనడానికి అదే నిదర్శనం'

ఈటల రాజేందర్‌కు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని హుజూరాబాద్‌ ఉప ఎన్నికల భాజపా ఇంఛార్జీ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా మానిటరింగ్‌ చేయటమే తెరాస ఓడిపోతుందనడానికి నిదర్శనమన్నారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ దళితబంధు పథకం తీసుకొచ్చారని ఆరోపించారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈటల రాజేందర్​పై అసత్యాలు ప్రచారాలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జితేందర్​రెడ్డి తెలిపారు. ముఖ్య నేతలతో సమావేశం కారణంగా ఈటల రాజేందర్‌ ప్రజా దీవెన పాదయాత్రకు రేపు ఒక్క రోజు విరామం ఇస్తునట్లు చెప్పారు. ఎల్లుండి నుంచి పాదయాత్ర మరింత ఉద్ధృతంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

హుజూరాబాద్​ బై ఎలక్షన్​లో ఈటల రాజేందర్​కు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇది నీ ఒక్కడి ఆత్మగౌరవ పోరాటం కాదు.. హుజూరాబాద్​ నియోజకవర్గ ప్రజలందరిది అంటూ మద్దతిస్తున్నారు. ఈరోజు కేసీఆర్​ భయపడి ఫామ్​హౌస్​ను వదిలి.. ప్రగతిభవన్​లో కూర్చుని రకరకాల కుట్రలు చేస్తున్నారు. ఈటల రాజేందర్​పై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్య నేతల సమావేశం కారణంగా ఈటల రాజేందర్​ రేపు ఒక్కరోజు పాదయాత్రకు విరామం తీసుకుంటున్నారు. ఎల్లుండి నుంచి తిరిగి పోరు కొనసాగుతుంది.-జితేందర్​రెడ్డి, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల భాజపా ఇంఛార్జీ

ఇదీ చూడండి: Huzurabad By elections: హుజూరాబాద్​ బరిలో 800 ఎంపీటీసీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.