ETV Bharat / state

అమరావతి కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలి: జేసీ దివాకర్ రెడ్డి

author img

By

Published : Jan 2, 2021, 10:35 PM IST

ఏపీలో అమరాతి ఐకాస పిలుపునిస్తే ఆమరణ దీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 70 ఏళ్లకు పైబడిన వాళ్లు.. ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలని సూచించారు.

అమరావతి కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలి
అమరావతి కోసం ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలి

ఏపీలో అమరావతి ఉద్యమంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లకు పైబడిన వాళ్లు ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలని అన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రధాని స్పందించారని గుర్తు చేశారు. అమరావతి ఉద్యమం మొదలై ఏడాది గడిచినా...ఇప్పటి వరకూ కనీసం ప్రాథమిక చర్చ కూడా జరగలేదని వ్యాఖ్యానించారు.

అమరావతిలో జరుగుతున్నది అసలు ఉద్యమమే కాదనే భావనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపన్యాసాలు కాదని.. ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలని సూచించారు. అంకితభావంతో పోరాడితే పీఎం, సీఎం ఎందుకు దిగిరారో చూద్దామని తెలిపారు. అమరావతి ఐకాస పిలుపునిస్తే ఆమరణదీక్షకు తాను ముందుంటానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సంక్రాంతి వేళ 4980 ప్రత్యేక బస్సులు

ఏపీలో అమరావతి ఉద్యమంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లకు పైబడిన వాళ్లు ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలని అన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రధాని స్పందించారని గుర్తు చేశారు. అమరావతి ఉద్యమం మొదలై ఏడాది గడిచినా...ఇప్పటి వరకూ కనీసం ప్రాథమిక చర్చ కూడా జరగలేదని వ్యాఖ్యానించారు.

అమరావతిలో జరుగుతున్నది అసలు ఉద్యమమే కాదనే భావనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపన్యాసాలు కాదని.. ప్రాణత్యాగాలకు సిద్ధం కావాలని సూచించారు. అంకితభావంతో పోరాడితే పీఎం, సీఎం ఎందుకు దిగిరారో చూద్దామని తెలిపారు. అమరావతి ఐకాస పిలుపునిస్తే ఆమరణదీక్షకు తాను ముందుంటానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: సంక్రాంతి వేళ 4980 ప్రత్యేక బస్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.