ETV Bharat / state

'హైదరాబాద్​ ఫిన్​టెక్​ ఫోరమ్​'ను ప్రారంభించిన జయేశ్​ రంజన్​ - జయేశ్ రంజన్

హైదరాబాద్​లోని ఆర్థిక సేవలకు సంబంధించిన సాంకేతికత కంపెనీలకు వేదికగా 'హైదరాబాద్ ఫిన్ టెక్ ఫోరమ్' (హెచ్ఎఫ్ఎఫ్)ను నేడు ప్రారంభించారు.

'హైదరాబాద్​ ఫిన్​టెక్​ ఫోరమ్​'ను ప్రారంభించిన జయేశ్​ రంజన్​
author img

By

Published : Sep 17, 2019, 7:19 PM IST

హైదరాబాద్​లోని ఆర్థిక సేవలకు సంబంధించిన సాంకేతికత కంపెనీలకు వేదికగా హెచ్ఎఫ్ఎఫ్​ను నేడు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఆర్థిక సాంకేతికతకు సంబంధించిన ఆలోచనలు, వివిధ ఆంశాలపై చర్చించడానికి ఇది ఒక వేదికగా నిలవనుంది. సంవత్సరానికి ఒక పెద్ద సంస్థను తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫోరమ్​లో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాలలో 7 స్పెషల్ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు జయేశ్​ రంజన్​ పేర్కొన్నారు.

అంకురాలకు మెంటార్ షిప్..!

600లకు పైగా సభ్యులతో మొదలైన ఈ ఫోరమ్ లో అంకురాలు, బహుళజాతి సంస్థలు, ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు ఉన్నారు. ఆర్థిక సాంకేతికత సంబంధించిన ఆలోచనలతో పాటు ఆ రంగానికి సంబంధించిన వివిధ ఆంశాలపై చర్చించటానికి ఇది ఒక వేదికగా ఉండనుంది. అంకురాలకు మెంటార్ షిప్ ను కూడా హెచ్ఎఫ్ ఎఫ్ అందించనుంది. దీనికోసం గ్లోబల్ ఫిన్ టెక్ మెంటార్ గ్రిడ్ ను ఏర్పాటు చేయనుంది. టీ-హబ్ కూడా ఈ ఫోరమ్ లో సభ్యత్వం కలిగి ఉంది.

హాంకాంగ్ ఇంక్యూబేటర్​తో ఒప్పందం
కార్యక్రమంలో హైదరాబాద్​లోని అంకుర ఇంక్యూబేటర్ అయిన క్యూ-హబ్​తో డబ్ల్యూహబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇరు దేశాల్లో ఫిన్ టెక్ మార్కెట్​పై పరస్పర అవగాహన కలుగుతుంది

'హైదరాబాద్​ ఫిన్​టెక్​ ఫోరమ్​'ను ప్రారంభించిన జయేశ్​ రంజన్​

ఇవీచూడండి: ఇది ట్రైలర్​ మాత్రమే.. సినిమా ముందుంది: కేటీఆర్

హైదరాబాద్​లోని ఆర్థిక సేవలకు సంబంధించిన సాంకేతికత కంపెనీలకు వేదికగా హెచ్ఎఫ్ఎఫ్​ను నేడు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఆర్థిక సాంకేతికతకు సంబంధించిన ఆలోచనలు, వివిధ ఆంశాలపై చర్చించడానికి ఇది ఒక వేదికగా నిలవనుంది. సంవత్సరానికి ఒక పెద్ద సంస్థను తయారు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫోరమ్​లో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాలలో 7 స్పెషల్ గ్రూపులను ఏర్పాటు చేసినట్లు జయేశ్​ రంజన్​ పేర్కొన్నారు.

అంకురాలకు మెంటార్ షిప్..!

600లకు పైగా సభ్యులతో మొదలైన ఈ ఫోరమ్ లో అంకురాలు, బహుళజాతి సంస్థలు, ప్రభుత్వాధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు ఉన్నారు. ఆర్థిక సాంకేతికత సంబంధించిన ఆలోచనలతో పాటు ఆ రంగానికి సంబంధించిన వివిధ ఆంశాలపై చర్చించటానికి ఇది ఒక వేదికగా ఉండనుంది. అంకురాలకు మెంటార్ షిప్ ను కూడా హెచ్ఎఫ్ ఎఫ్ అందించనుంది. దీనికోసం గ్లోబల్ ఫిన్ టెక్ మెంటార్ గ్రిడ్ ను ఏర్పాటు చేయనుంది. టీ-హబ్ కూడా ఈ ఫోరమ్ లో సభ్యత్వం కలిగి ఉంది.

హాంకాంగ్ ఇంక్యూబేటర్​తో ఒప్పందం
కార్యక్రమంలో హైదరాబాద్​లోని అంకుర ఇంక్యూబేటర్ అయిన క్యూ-హబ్​తో డబ్ల్యూహబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా ఇరు దేశాల్లో ఫిన్ టెక్ మార్కెట్​పై పరస్పర అవగాహన కలుగుతుంది

'హైదరాబాద్​ ఫిన్​టెక్​ ఫోరమ్​'ను ప్రారంభించిన జయేశ్​ రంజన్​

ఇవీచూడండి: ఇది ట్రైలర్​ మాత్రమే.. సినిమా ముందుంది: కేటీఆర్

Intro:byte : Jayesh Ranjn, Principal Secretary, IT and Industries


Body:byte : Jayesh Ranjn, Principal Secretary, IT and Industries


Conclusion:byte : Jayesh Ranjn, Principal Secretary, IT and Industries
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.