ETV Bharat / state

మిషన్ భగీరథ పథకం భేష్ - తెలంగాణలో పర్యటించిన జల్​ జీవన్ అధికారులు

2024 నాటికి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందుగా తెలంగాణ సాధించిందని జల్ జీవన్ మిషన్ టాస్క్ ఫోర్స్ ప్రశంసించింది. మిషన్ భగీరథతో నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని అధికారులను అభినందించింది.

Jal Jeevan Mission Task force Tour in Telangana
మిషన్ భగీరథ పథకం భేష్
author img

By

Published : Jan 20, 2020, 8:17 PM IST

2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా నలుగురు సభ్యుల జాతీయ బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, ఇంటెక్ వెల్స్​తో పాటు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకుంది.

ఇవాళ ఎర్రమంజిల్​లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను, భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను జల్ జీవన్ టాస్క్ ఫోర్స్​కు అధికారులు వివరించారు. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత నీటిని సరాఫరా చేస్తున్న ఇంజనీర్లకు అభినందించారు.

మిషన్ భగీరథ పథకం భేష్


ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'

2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా నలుగురు సభ్యుల జాతీయ బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాలు, ఇంటెక్ వెల్స్​తో పాటు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకుంది.

ఇవాళ ఎర్రమంజిల్​లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను, భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను జల్ జీవన్ టాస్క్ ఫోర్స్​కు అధికారులు వివరించారు. నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత నీటిని సరాఫరా చేస్తున్న ఇంజనీర్లకు అభినందించారు.

మిషన్ భగీరథ పథకం భేష్


ఇదీ చూడండి:- 'నాకు రాజకీయాలొద్దు.. నిర్భయ దోషులకు శిక్ష కావాలి'

TG_Hyd_42_20_Jal_Jeevan_Mission_Taskforce_AV_3053262 Reporter: Raghuvardhan Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) 2024 నాటికి ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని అందరికంటే ముందుగా తెలంగాణ సాధించిందని జల్ జీవన్ మిషన్ టాస్క్ ఫోర్స్ ప్రశంసించింది. మిషన్ భగీరథ తో నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరిగిందని అధికారులను అభినందించింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలన్న కేంద్ర ప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా నలుగురు సభ్యుల జాతీయ బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ నెల 17వ తేదీ నుంచి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. మిషన్ భగీరథ నీటి శుద్ది కేంద్రాలు, ఇంటెక్ వెల్స్ తో పాటు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా భగీరథ నీటిని ఉపయోగిస్తున్న ప్రజలను కలిసి అభిప్రాయాలు తెలుసుకుంది. ఇవాళ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డి తో సమావేశం అయింది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు స్వరూపం, లక్ష్యాలను జల్ జీవన్ టాస్క్ ఫోర్స్ కు భగీరథ అధికారులు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భగీరథ ప్రాజెక్టు ఫోటోలు, తాగునీరు సరాఫరా అవుతున్న ఆవాసాల్లోని ప్రస్తుత స్థితిని తెలియచేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథతో ఇంటి ముందుకే సురక్షిత తాగునీటిని సరాఫరా చేయడానికి ఎంత కష్టపడుతున్నారో ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత భగీరథ అధికారుల మీదనే ఉందని గుజరాత్ వాస్మో(WASMO) ప్రాజెక్ట్ మాజీ డైరెక్టర్ ఆర్. కే సుమా తెలిపారు. కమ్యూనిటీ భాగస్వామ్యంతో మరింత సమర్థవంతమైన తాగునీటి సరాఫరా వ్యవస్థను రూపొందించవచ్చు అన్నారు. తాగునీరు ఎంతో పవిత్రమైనదని దాన్ని వృథా చేయవద్దని ప్రజలను కోరారు. ఆ తరువాత వాష్ స్పెషలిస్ట్ అవినాష్ జుస్తి (AVINASH ZUTSHI , WASH SPECIAIST) మాట్లాడుతూ నల్లగొండ ఫ్లోరైడ్ గ్రామాల్లో పర్యటించామని... మిషన్ భగీరథ నీటిని ఉపయోగించిన 15 రోజుల్లోనే స్పష్టమైన మార్పు కనిపించిందని బాధితులు చెప్పారని పేర్కొన్నారు. సొంతంగా నిలబడడం, నడవడం చేస్తున్నామని చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయంగా కొనియాడారు. నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు సురక్షిత నీటిని సరాఫరా చేస్తున్న ఇంజనీర్లకు అభినందనందించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.