మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లి కేంద్ర కారాగారాన్ని జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది సందర్శించారు. జైల్లో ఖైదీలకు కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వైరస్ పట్ల వారికి అవగాహన కల్పించాలని ఆయన జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఖైదీలు కూడా వ్యక్తిగత దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని, శానిటైజర్స్ వాడాలని త్రివేది సూచించారు. కొత్తగా ఖైదీలకు వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జైలు అధికారులకు దిశానిర్ధేశం చేశారు.