హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో గుంటూరు హిందూ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోశయ్య, సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావుతోపాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొని చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ కళాశాలలో సినీ దర్శకుడు కే.విశ్వనాథ్, బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ గవర్నర్ రోశయ్య, పలువురు రాజకీయ ప్రముఖులు చదువుకున్నారని గుంటూరు పూర్వ విద్యార్థుల సంఘం తెలిపింది. గురువులు చెప్పిన సలహాలు, సూచనలు కొన్ని మాత్రమే అమలు చేశానని... పూర్తిగా అమలు చేస్తే బాగుండేదని రోశయ్య అన్నారు.
ఇదీ చూడండి:'విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించే బాధ్యత మాది'