ETV Bharat / state

కాళేశ్వరం గుత్తేదారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

author img

By

Published : Jan 9, 2021, 3:17 PM IST

Updated : Jan 9, 2021, 3:32 PM IST

హైదరాబాద్​లోని కొంత మంది గుత్తేదారుల ఇళ్లతోపాటు కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడులు ఏకకాలంలో కరీంనగర్‌లో కూడా కొనసాగుతున్నాయి.

it-raids-in-kaleshwaram-sub-contractors-in-hyderabad-and-karimnagar
కాళేశ్వరం గుత్తేదారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

రాష్ట్రంలోని హైదరాబాద్​, కరీంనగర్​లో కొంత మంది గుత్తేదారుల ఇళ్లతోపాటు కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో రెండు నగరాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. 20కి పైగా ఐటీ అధికారులతో కూడిన బృందాలు సోదాలు చేస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్టర్లు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆదాయపన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దాడులు కొనసాగిస్తున్నారు.

రాష్ట్రంలోని హైదరాబాద్​, కరీంనగర్​లో కొంత మంది గుత్తేదారుల ఇళ్లతోపాటు కార్యాలయాల్లో ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో రెండు నగరాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. 20కి పైగా ఐటీ అధికారులతో కూడిన బృందాలు సోదాలు చేస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు సబ్‌ కాంట్రాక్టర్లు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆదాయపన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దాడులు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత

Last Updated : Jan 9, 2021, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.