హైదరాబాద్ మౌలాలిలో భారతీయ రైల్వే ఆర్థిక నిర్వహణ సంస్థ అయిన ఇండియన్ రైల్వేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ను రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. రైల్వేశాఖ మౌలాలీలోని డిజిల్ లోకోషెడ్ ఎదురుగా ఇరిఫెంను ఏర్పాటు చేసింది.
ఆర్థికపరమైన విషయాలు, గణాంకాల పద్ధతుల్లో వస్తున్న మార్పుల నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలను ఉద్యోగులకు అందించేందుకు రైల్వేశాఖ ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఆర్థికపరమైన అంశాల్లో సూపర్వైజర్ నుంచి ఐఆర్టీఎస్ స్థాయి అధికారుల వరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, రైల్వే బోర్డు ఫైనాన్షియల్ కమిషనర్ మంజులా రంగరాజన్ తదితరులు పాల్గొన్నారు.