సికింద్రాబాద్ వారాసిగూడలో జరిగిన బాలిక హత్యపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం వచ్చి... ఆధారాలు సేకరిస్తోంది. రాత్రి బాలిక చదువుకోవడానికి భవనంపైకి వెళ్లినప్పుడు ఎవరో బాలిక తలపై రాయితో కొట్టినట్లు గుర్తించారు. బాలికను కొతం కాలంగా షోయబ్ అనే వ్యక్తి వేధిస్తున్నట్లు బాధిత బంధువులు తెలిపారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.