ఐటీ పరిశ్రమపై కొవిడ్ రెండోదశ ప్రభావం గట్టిగానే ఉందని హైసీయూ అధ్యక్షుడు భరణి కుమార్ అన్నారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు 18-44 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నారని... ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్ కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అందుకోసం అపోలో, మెడికవర్, కిమ్స్, స్టార్ హాస్పిటల్స్ వంటి కార్పొరేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకొని ఐటీ క్యాంపస్లు, ఆస్పత్రుల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల పదో తేదీన ఐటీ వార్షిక నివేదికను ప్రభుత్వం విడుదల చేస్తుందంటోన్న ఐటీ అసోసియేషన్ అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: KTR : 'రూ.500 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో మార్కెట్లు'