ETV Bharat / state

'ప్రైవేటు వ్యక్తులను ఆదుకునేందుకే కేంద్రం ప్యాకేజీ తెస్తోంది'

author img

By

Published : May 17, 2020, 6:58 PM IST

విద్యుత్ రంగంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. డిస్కంల ప్రైవేటీకరణ, రాయితీలు పొందుతున్న వినియోగదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ, స్మార్ట్ ప్రీపేయిడ్ మీటర్లు తదితర అంశాలు విద్యుత్ రంగంపై ఎటువంటి ప్రభావం చూపించనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అఖిల భారత పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రత్నాకర్ రావుతో మా ప్రతినిధి ముఖాముఖి.

interview with aipef general secretary
'ప్రైవేటు వ్యక్తులను ఆదుకునేందుకే కేంద్రం ప్యాకేజీ తెస్తుంది'
అఖిల భారత పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రత్నాకర్ రావుతో ముఖాముఖి

ప్రశ్న: కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటుపరం చేస్తామనే ప్రతిపాదనలు వస్తున్నాయి.. ఈ ప్రభావం విద్యుత్​రంగంపై ఏవిధంగా ఉంటుంది?

జవాబు: డిస్ట్రిబ్యూషన్​ కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామనడం విద్యుత్​రంగాన్ని ప్రైవేటుపరం చేయాలనుకోవడంలో భాగమే. ఇది కేంద్రపాలిత ప్రాంతాలతోనే ఆగదు. మిగిలిన రాష్ట్రాలలోను ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని మనం చూశాం. కరోనా పరిస్థితిలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తామనే ప్రకటనలు రావడం బాధాకరం. ఈ పరిస్థితిలో విద్యుత్​రంగ సంస్థలు.. కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు అందరూ కేంద్ర మంత్రి ప్రకటనపై భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రక్రియను అడ్డుకోడానికి జాతీయ స్థాయిలో విద్యుత్​రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాల ఆధీనంలోనే పభుత్వరంగ సంస్థలు విజయం సాధియనడానికి తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలను చూస్తున్నాం. నష్టాలు రావడానికి చాలా కారణాలున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరగడం ఇతర వ్యయాలు ఉన్నాయి. వాటిని తగ్గించుకోడానికి ప్రయత్నించాలి. ప్రైవేటుపరం చేయడం వల్ల ధరలు తగ్గాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్​ చేస్తున్నాం.

ప్రశ్న: ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్లు నష్టాల్లో ఉన్నాయి.. ఈ ప్రైవేటీ కరణ నిర్ణయం వాటిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

జవాబు: ప్రైవేటీకరణ వల్ల వినియోగదారులకు క్రాస్​ సబ్సిడి తగ్గించాల్సి వస్తుంది.

ప్రశ్న: రాయితీలను విద్యుత్​ వినియోగదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా చెల్లిస్తామంటున్నారు... అది ఎంతవరకు సమంజసం?

జవాబు: ప్రస్తుత రోజుల్లో విద్యుత్​ వినియోగం పెరుగుతోంది. ముందుగా విద్యుత్​ బిల్లును ఎలా చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే సరఫరా నిలిపేయాల్సి వస్తుంది. గృహ వినియోగదారులకు కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాకపోతే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ప్రతినెలా వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తే చాలా ఇబ్బంది పడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న: డిస్కంలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామనే భరోసా ఇస్తున్నారు... దీనిపై మీ అభిప్రాయం?

జవాబు: విద్యుత్​రంగంలో మెరుగైన సౌకర్యం అంటే అనుకూలమైన ధరలో 24 గంటల పాటు అందించాలి. 24 గంటలు విద్యుత్​ సరఫరా చేయాలంటే నెట్​వర్క్​ విస్తృతం చేయాలి. ఇలా చేయాలంటే డిస్కంలో వేలకోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అదే ప్రైవేటుపరం చేస్తే ఇంత పెట్టుబడి వాళ్లు పెట్టలేరు.

ప్రశ్న: స్మార్ట్​ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల వినియోగదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది?

జవాబు: స్మార్ట్​ మీటర్ల ద్వారా వినియోగదారులకు ఎటువంటి లబ్ధి చేకూరదు. కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ విధానం అమల్లోకి వచ్చింది. త్వరలో మనకూ వస్తాయి. వీటిని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్నది. వీటి ఏర్పాటును ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తే దానికి సంబంధించిన మొత్తాన్ని టారిప్​ పెంచడం ద్వారా వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. వీటి వల్ల వినియోగదారులకు పెద్ద ఉపయోగం లేదు.

ప్రశ్న: కేంద్ర మంత్రి ప్రసంగం ద్వారా ఎటువంటి రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని మీరు భావిస్తున్నారు?

జవాబు: విద్యుత్​ రంగాన్ని ప్రేవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారు. 90 వేల కోట్ల ప్యాకేజీలోను చూస్తే ఐపీపీసీ వాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రకటించినట్లు ఉంది. వాళ్లకు డబ్బులు చెల్లించేందుకు ఈ మొత్తాన్ని డిస్కంలకు అప్పులా ఇస్తున్నారు. అది కూడా నేరుగా వారికే చెల్లిస్తున్నారు. కానీ పుస్తకాల్లో డిస్కంలకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు రాస్తున్నార. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. ఇది డిస్కంను ఆదుకున్నట్టు కాదు. ఇది కేవలం ప్రేవేటు వ్యక్తులను ఆదుకోడానికే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ తీసుకొస్తుంది.

ఇదీ చదవండిః డ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..

అఖిల భారత పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రత్నాకర్ రావుతో ముఖాముఖి

ప్రశ్న: కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రైవేటుపరం చేస్తామనే ప్రతిపాదనలు వస్తున్నాయి.. ఈ ప్రభావం విద్యుత్​రంగంపై ఏవిధంగా ఉంటుంది?

జవాబు: డిస్ట్రిబ్యూషన్​ కంపెనీలను ప్రైవేటుపరం చేస్తామనడం విద్యుత్​రంగాన్ని ప్రైవేటుపరం చేయాలనుకోవడంలో భాగమే. ఇది కేంద్రపాలిత ప్రాంతాలతోనే ఆగదు. మిగిలిన రాష్ట్రాలలోను ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని మనం చూశాం. కరోనా పరిస్థితిలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తామనే ప్రకటనలు రావడం బాధాకరం. ఈ పరిస్థితిలో విద్యుత్​రంగ సంస్థలు.. కార్మికులు, ఉద్యోగులు, ఇంజినీర్లు అందరూ కేంద్ర మంత్రి ప్రకటనపై భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రక్రియను అడ్డుకోడానికి జాతీయ స్థాయిలో విద్యుత్​రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వాల ఆధీనంలోనే పభుత్వరంగ సంస్థలు విజయం సాధియనడానికి తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాలను చూస్తున్నాం. నష్టాలు రావడానికి చాలా కారణాలున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరగడం ఇతర వ్యయాలు ఉన్నాయి. వాటిని తగ్గించుకోడానికి ప్రయత్నించాలి. ప్రైవేటుపరం చేయడం వల్ల ధరలు తగ్గాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్​ చేస్తున్నాం.

ప్రశ్న: ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్లు నష్టాల్లో ఉన్నాయి.. ఈ ప్రైవేటీ కరణ నిర్ణయం వాటిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

జవాబు: ప్రైవేటీకరణ వల్ల వినియోగదారులకు క్రాస్​ సబ్సిడి తగ్గించాల్సి వస్తుంది.

ప్రశ్న: రాయితీలను విద్యుత్​ వినియోగదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా చెల్లిస్తామంటున్నారు... అది ఎంతవరకు సమంజసం?

జవాబు: ప్రస్తుత రోజుల్లో విద్యుత్​ వినియోగం పెరుగుతోంది. ముందుగా విద్యుత్​ బిల్లును ఎలా చెల్లించాలి. ఒకవేళ చెల్లించకపోతే సరఫరా నిలిపేయాల్సి వస్తుంది. గృహ వినియోగదారులకు కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాకపోతే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు ప్రతినెలా వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తే చాలా ఇబ్బంది పడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రశ్న: డిస్కంలను ప్రైవేటీకరణ చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామనే భరోసా ఇస్తున్నారు... దీనిపై మీ అభిప్రాయం?

జవాబు: విద్యుత్​రంగంలో మెరుగైన సౌకర్యం అంటే అనుకూలమైన ధరలో 24 గంటల పాటు అందించాలి. 24 గంటలు విద్యుత్​ సరఫరా చేయాలంటే నెట్​వర్క్​ విస్తృతం చేయాలి. ఇలా చేయాలంటే డిస్కంలో వేలకోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అదే ప్రైవేటుపరం చేస్తే ఇంత పెట్టుబడి వాళ్లు పెట్టలేరు.

ప్రశ్న: స్మార్ట్​ మీటర్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల వినియోగదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది?

జవాబు: స్మార్ట్​ మీటర్ల ద్వారా వినియోగదారులకు ఎటువంటి లబ్ధి చేకూరదు. కేవలం అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ విధానం అమల్లోకి వచ్చింది. త్వరలో మనకూ వస్తాయి. వీటిని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్నది. వీటి ఏర్పాటును ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తే దానికి సంబంధించిన మొత్తాన్ని టారిప్​ పెంచడం ద్వారా వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. వీటి వల్ల వినియోగదారులకు పెద్ద ఉపయోగం లేదు.

ప్రశ్న: కేంద్ర మంత్రి ప్రసంగం ద్వారా ఎటువంటి రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని మీరు భావిస్తున్నారు?

జవాబు: విద్యుత్​ రంగాన్ని ప్రేవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారు. 90 వేల కోట్ల ప్యాకేజీలోను చూస్తే ఐపీపీసీ వాళ్లను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రకటించినట్లు ఉంది. వాళ్లకు డబ్బులు చెల్లించేందుకు ఈ మొత్తాన్ని డిస్కంలకు అప్పులా ఇస్తున్నారు. అది కూడా నేరుగా వారికే చెల్లిస్తున్నారు. కానీ పుస్తకాల్లో డిస్కంలకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు రాస్తున్నార. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. ఇది డిస్కంను ఆదుకున్నట్టు కాదు. ఇది కేవలం ప్రేవేటు వ్యక్తులను ఆదుకోడానికే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ తీసుకొస్తుంది.

ఇదీ చదవండిః డ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.