కులాంతర, మతాంతర వివాహితుల మేళా-48వ వార్షికోత్సవం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించారు. ఆ సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు.
మతాంతర వివాహం చేసుకున్న వారికి ఉన్నంతలో కొంత చేయూత నివ్వాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప రాజ్యాంగాన్ని అంబేడ్కర్ మనకు అందించారని మంత్రి అన్నారు. కుల, మత, లౌకిక అంతరాలు లేని సమాజం ఏర్పడాలని అంబేడ్కర్ కళలు కన్నారని గుర్తుచేశారు.
ఇదీ చూడండి : మేయర్లు, ఛైర్పర్సన్ల ఎంపికపై కసరత్తు...