ETV Bharat / state

Special Story on Aneeshwar : ఏడేళ్లకే అద్భుతాలతో దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న బుల్లి మేధావి

author img

By

Published : May 19, 2023, 2:54 PM IST

Updated : May 21, 2023, 10:36 AM IST

Special Story on Aneeshwar : బుడి బుడి అడుగుల ప్రాయంలో పిల్లలు చేసే ఏ పనైనా చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అదే పిల్లలు పెద్దయ్యాక తమను మించిన వారైతే గర్వపడుతుంటారు. కానీ.. పసి ప్రాయంలోనే ప్రపంచాన్నే అబ్బురపరిచే వారైతే ఇక ఆ కన్నవారు అనుభవించే అనుభూతులు మాటల్లో చెప్పలేం. పదేళ్లైనా నిండకుండానే ప్రకృతి పాఠాలు చెబుతూ దేశ దేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడో బుల్లి మేధావి. అంతేకాదు.. ఇటీవల బ్రిటన్‌ కింగ్‌ పట్టాభిషేకానికి ఆహ్వానం పొంది, అక్కడి ప్రధాని మన్ననలు పొందిన ఆ చిన్నారెవరో ఇప్పుడు చూద్దాం.

Aneeshwar
Aneeshwar

Special Story on Aneeshwar : ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరుకు చెందిన కుంచాల అనిల్-స్నేహ దంపతులు యూకేలో స్థిరపడ్డారు. వీరికి ఓ బాబు ఏడేళ్ల అనీశ్వర్‌ ఉన్నాడు. 4 ఏళ్ల ప్రాయం నుంచే వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తిని కనబర్చిన చిన్నారి.. ప్రకృతిపై ఉన్న మక్కువ ఇంట్లో వారితో, స్నేహితులతో మాట్లాడుతుంటే కనిపిస్తూ ఉండేది. కరోనా సమయంలో వందేళ్లు నిండిన ఓ వృద్ధుడు యూకేలో వైద్య సేవల కోసం విరాళాలు సేకరిస్తుండటాన్ని టీవీలో గమనించిన అనీశ్వర్‌.. తనకున్న ఆసక్తిని తల్లిదండ్రులతో చెప్పాడు. అలా తానూ విరాళాల సేకరణకు అడుగులు వేసి 3 వేల పౌండ్లను, పీపీ కిట్‌లను భారత్‌ దేశానికి సహాయంగా అందజేశాడు.

ఈ క్రమంలోనే 'లిటిల్‌ పెడ్లర్స్‌ ఛాలెంజ్‌'ను ఏర్పాటు చేసి సైకిల్‌ తొక్కుతూ ప్రజలకు కొవిడ్‌ గురించి, అవగాహన కల్పిస్తూ నిధులు సేకరించే ప్రయత్నం చేశాడు ఈ లిటిల్‌ అనీశ్వర్‌. ఈ ఛాలెంజ్‌లో తన స్నేహితులనూ భాగస్వామ్యం చేసి, లిటల్‌ పెడ్లర్స్‌, అనీశ్​ అండ్‌ ఫ్రెండ్స్‌గా మార్చాడు. 57 మంది పిల్లలతో కలిసి అనీశ్​ ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

బ్రిటన్‌లో ప్రముఖ టీవీ రియాల్టీ షోలో మెరిసి..: అతి చిన్న వయస్సులో అనీశ్వర్ అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న తీరును చూసి కుటుంబసభ్యులు, బంధువులు గర్వపడుతున్నారు. వీటితో పాటు బొమ్మలు వేయటం, అమెరికా, బ్రిటన్‌లలో ప్రముఖ టీవీ రియాల్టీ షోల్లో పాల్గొంటూ అబ్బురపరుస్తున్నాడు. బ్రిటెన్స్‌ గాట్‌ ట్యాలెంట్‌లో ఫైనల్‌-5 వరకు వెళ్లిన ప్రవాస భారతీయుడిగా అనీశ్ పేరు తెచ్చుకున్నాడు. అద్భుత కవితా శక్తితో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కింగ్ 'ఛార్లెస్‌-3' పట్టాభిషేకానికి స్వయంగా ప్రధాని నుంచి ఆహ్వానం: పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ అడవుల పరిరక్షణ, ప్రకృతి ప్రాముఖ్యతను చాటిచెప్పే అనీశ్వర్.. ఇటీవల బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషీ సునాక్‌ను కలిశాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన బ్రిటన్‌ కింగ్ 'ఛార్లెస్‌-3' పట్టాభిషేకానికి స్వయంగా ప్రధాని నుంచి ఆహ్వానం అందుకున్నాడు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ను కలిసిన అనీశ్వర్ శ్వేతసౌధాన్ని సందర్శించి, వాతావరణ మార్పు, వన్య ప్రాణుల సంరక్షణపై చర్చించాలనే తన కోరికను ఆమె వద్ద వ్యక్తపర్చాడు.

పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ప్రాముఖ్యతకు విధాన రూపకల్పనలో పిల్లలను భాగస్వామ్యం చేయాలనే తన అభిప్రాయాన్ని అనీశ్వర్ ప్రపంచ నాయకుల ముందు వివరించాడు. దుబాయ్‌లో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్- కాప్​-28కి తాను హాజరు కావాలనుకుంటున్నట్లు చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

Special Story on Aneeshwar : ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరుకు చెందిన కుంచాల అనిల్-స్నేహ దంపతులు యూకేలో స్థిరపడ్డారు. వీరికి ఓ బాబు ఏడేళ్ల అనీశ్వర్‌ ఉన్నాడు. 4 ఏళ్ల ప్రాయం నుంచే వన్యప్రాణుల సంరక్షణపై ఆసక్తిని కనబర్చిన చిన్నారి.. ప్రకృతిపై ఉన్న మక్కువ ఇంట్లో వారితో, స్నేహితులతో మాట్లాడుతుంటే కనిపిస్తూ ఉండేది. కరోనా సమయంలో వందేళ్లు నిండిన ఓ వృద్ధుడు యూకేలో వైద్య సేవల కోసం విరాళాలు సేకరిస్తుండటాన్ని టీవీలో గమనించిన అనీశ్వర్‌.. తనకున్న ఆసక్తిని తల్లిదండ్రులతో చెప్పాడు. అలా తానూ విరాళాల సేకరణకు అడుగులు వేసి 3 వేల పౌండ్లను, పీపీ కిట్‌లను భారత్‌ దేశానికి సహాయంగా అందజేశాడు.

ఈ క్రమంలోనే 'లిటిల్‌ పెడ్లర్స్‌ ఛాలెంజ్‌'ను ఏర్పాటు చేసి సైకిల్‌ తొక్కుతూ ప్రజలకు కొవిడ్‌ గురించి, అవగాహన కల్పిస్తూ నిధులు సేకరించే ప్రయత్నం చేశాడు ఈ లిటిల్‌ అనీశ్వర్‌. ఈ ఛాలెంజ్‌లో తన స్నేహితులనూ భాగస్వామ్యం చేసి, లిటల్‌ పెడ్లర్స్‌, అనీశ్​ అండ్‌ ఫ్రెండ్స్‌గా మార్చాడు. 57 మంది పిల్లలతో కలిసి అనీశ్​ ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తిచేసి ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.

బ్రిటన్‌లో ప్రముఖ టీవీ రియాల్టీ షోలో మెరిసి..: అతి చిన్న వయస్సులో అనీశ్వర్ అవగాహన కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న తీరును చూసి కుటుంబసభ్యులు, బంధువులు గర్వపడుతున్నారు. వీటితో పాటు బొమ్మలు వేయటం, అమెరికా, బ్రిటన్‌లలో ప్రముఖ టీవీ రియాల్టీ షోల్లో పాల్గొంటూ అబ్బురపరుస్తున్నాడు. బ్రిటెన్స్‌ గాట్‌ ట్యాలెంట్‌లో ఫైనల్‌-5 వరకు వెళ్లిన ప్రవాస భారతీయుడిగా అనీశ్ పేరు తెచ్చుకున్నాడు. అద్భుత కవితా శక్తితో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

కింగ్ 'ఛార్లెస్‌-3' పట్టాభిషేకానికి స్వయంగా ప్రధాని నుంచి ఆహ్వానం: పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ అడవుల పరిరక్షణ, ప్రకృతి ప్రాముఖ్యతను చాటిచెప్పే అనీశ్వర్.. ఇటీవల బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషీ సునాక్‌ను కలిశాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన బ్రిటన్‌ కింగ్ 'ఛార్లెస్‌-3' పట్టాభిషేకానికి స్వయంగా ప్రధాని నుంచి ఆహ్వానం అందుకున్నాడు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ను కలిసిన అనీశ్వర్ శ్వేతసౌధాన్ని సందర్శించి, వాతావరణ మార్పు, వన్య ప్రాణుల సంరక్షణపై చర్చించాలనే తన కోరికను ఆమె వద్ద వ్యక్తపర్చాడు.

పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి ప్రాముఖ్యతకు విధాన రూపకల్పనలో పిల్లలను భాగస్వామ్యం చేయాలనే తన అభిప్రాయాన్ని అనీశ్వర్ ప్రపంచ నాయకుల ముందు వివరించాడు. దుబాయ్‌లో జరగనున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్- కాప్​-28కి తాను హాజరు కావాలనుకుంటున్నట్లు చెబుతున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : May 21, 2023, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.