ETV Bharat / state

మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల

author img

By

Published : Jan 9, 2021, 1:40 PM IST

Updated : Jan 9, 2021, 2:55 PM IST

i-take-first-corona-vaccine-says-minister-etala-rajendhar
మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల

13:39 January 09

మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల

రాష్ట్రంలో రెండో దశ డ్రై రన్ విజవంతమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. టీకా ఎప్పుడు పంపినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మొదటి కరోనా వ్యాక్సిన్ తానే తీసుకుంటానని ఈటల ప్రకటించారు.  

నిమ్స్‌లో ఆధునికీకరించిన క్యాన్సర్ విభాగాన్ని మంత్రి ఈటల  ప్రారంభించారు. క్యాన్సర్ విభాగం ఆధునికీకరణకు మేఘా సంస్థ రూ.18 కోట్లు అందించింది. ఈ కార్యక్రమంలో మేఘా సంస్థ ఛైర్మన్ పి.పి.రెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డి పాల్గొన్నారు. నిమ్స్‌లో క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్యం అందుబాటులోకి రానుంది.  

"కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదు. బర్డ్‌ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టంలేదు. బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. వైద్య ఖర్చులు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించలేం. ఈహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైద్య రంగంపై రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.450 కోట్లతో నిమ్స్‌లో అభివృద్ధి చేస్తాం. నిమ్స్‌లో సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా. వైద్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం."  

- ఈటల రాజేందర్​

ఇదీ చదవండి : అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత

13:39 January 09

మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల

రాష్ట్రంలో రెండో దశ డ్రై రన్ విజవంతమైందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ తెలిపారు. టీకా ఎప్పుడు పంపినా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రోజుకు 10 లక్షల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మొదటి కరోనా వ్యాక్సిన్ తానే తీసుకుంటానని ఈటల ప్రకటించారు.  

నిమ్స్‌లో ఆధునికీకరించిన క్యాన్సర్ విభాగాన్ని మంత్రి ఈటల  ప్రారంభించారు. క్యాన్సర్ విభాగం ఆధునికీకరణకు మేఘా సంస్థ రూ.18 కోట్లు అందించింది. ఈ కార్యక్రమంలో మేఘా సంస్థ ఛైర్మన్ పి.పి.రెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డి పాల్గొన్నారు. నిమ్స్‌లో క్యాన్సర్ రోగులకు ఆధునిక వైద్యం అందుబాటులోకి రానుంది.  

"కరోనా కొత్త స్ట్రెయిన్‌తో భయం లేదు. బర్డ్‌ ఫ్లూ వల్ల రాష్ట్రానికి ఎలాంటి నష్టంలేదు. బర్డ్ ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. వైద్య ఖర్చులు ఎప్పుడు ఎలా వస్తాయో ఊహించలేం. ఈహెచ్‌ఎస్, ఆరోగ్యశ్రీ కింద రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైద్య రంగంపై రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రూ.450 కోట్లతో నిమ్స్‌లో అభివృద్ధి చేస్తాం. నిమ్స్‌లో సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తా. వైద్య రంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం."  

- ఈటల రాజేందర్​

ఇదీ చదవండి : అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత

Last Updated : Jan 9, 2021, 2:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.