అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటించనున్న తరుణంలో భాగ్యనగరం బాచుపల్లి ప్రగతినగర్ వీఆర్ఎస్ పాఠశాల విద్యార్థులు ఆయనకు నూతన రీతిలో ఆహ్వానం పలికారు. 20 నిమిషాల్లోనే 425 మంది విద్యార్థులు 1200 పోస్టు కార్డులపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చిత్రాలను చిత్రించారు.
పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఫౌండర్, సీఈఓ సత్యవోలు రాంబాబు పాల్గొని... విద్యార్థులు గీసిన చిత్రాలను పరిశీలించి... విశ్వ గురు ప్రపంచ రికార్డుగా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కనబరిచిన నైపుణ్యాన్ని పాఠశాల డైరెక్టర్ కొడాలి విజయరాణి ప్రశంసించారు. ఈ 1200 పోస్టుకార్డులను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిస్తామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: ట్రంప్కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు