ETV Bharat / state

ఇది మాములు సైకిల్ కాదు...

పాతసైకిల్​ను తండ్రికి కొత్తగా అందించాలనే ఓ కొడుకు తపన వినూత్న ప్రయోగానికి నాంది పలికింది. 26 ఏళ్లుగా తన తండ్రికి సైకిల్​తో ఉన్న బంధాన్ని చిరకాలం కొనసాగేలా చేశాడు ఆ తనయుడు.

author img

By

Published : Feb 9, 2019, 7:17 AM IST

Updated : Feb 9, 2019, 10:14 AM IST

ఇదే ఆ సైకిల్

ఇది మాములు సైకిల్ కాదు...
గుల్బర్గాకు చెందిన ఓ విద్యార్థి నాన్న మీద ప్రేమతో బహుమానం ఇవ్వాలనుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తన తండ్రి పాత జ్ఞాపకానికి కొత్త రూపు ఇచ్చాడు. శభాష్ అనిపించుకుంటున్నాడు.
undefined
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చిత్తాపూర్​లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నాడు అజయ్ కుమార్. 26 ఏళ్ల నుంచి తన తండ్రి ఓ సైకిల్​ను వినియోగిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రానికి, ఇతర ప్రాంతాలకు దానిపైనే వెళ్లేవారు. సైకిల్ పాడవడటం వల్ల మూలన పడేశారు. తండ్రి కోరిక మేరకు అజయ్ ద్విచక్రవాహనం కొనుగోలు చేసి ఇవ్వాలనుకున్నాడు. అప్పుడే తన ఆలోచనలకు కొత్త రూపం ఇచ్చాడు.

తండ్రి వాడిన పాత సైకిల్​కే ఇంజిన్, లిథియం బ్యాటరీ అమర్చాడు. ఇంటర్నెట్​కు అనుసంధానం చేశాడు. మూడు విధాలుగా ప్రయాణించేలా రూపకల్పన చేశాడు. తొక్కడంతో పాటు బ్యాటరీ సహాయంతో నడవడం, బ్యాటరీ డౌన్ అయితే... ఇంధనంతో నడవడం దీని ప్రత్యేకత. సాధారణ ద్విచక్రవాహనాల కంటే పూర్తి స్థాయిలో శబ్ద, వాయు కాలుష్యం లేకుండా ఈ హైబ్రిడ్ సైకిల్​ను తీర్చిదిద్దాడు. ఒక్కసారి ఫుల్​ ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
హైదరాబాద్​లోని ఇండియా సాఫ్ట్ సదస్సులో ఈ హైబ్రిడ్ సైకిల్​ను వివిధ ఐటీ సంస్థలకు పరిచయం చేశారు. అజయ్ తయారు చేసిన ఈ సైకిల్​ను చూసిన బెంగళూరులోని అసెంట్ ఇంజినీరింగ్ టెక్నాలజీ సంస్థ వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల్లో వృథాగా పడి ఉన్న వస్తువులను పునర్వియోగంలోకి తీసుకొచ్చే ఈ సంస్థ... హైబ్రిడ్ సైకిల్​కు అండగా నిలిచింది. తండ్రికి మరిచిపోలేని జ్ఞాపకాన్ని తిరిగిచ్చిన అజయ్.. పనిలో పనిగా పర్యావరణానికి మేలుచేశాడు.

ఇది మాములు సైకిల్ కాదు...
గుల్బర్గాకు చెందిన ఓ విద్యార్థి నాన్న మీద ప్రేమతో బహుమానం ఇవ్వాలనుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తన తండ్రి పాత జ్ఞాపకానికి కొత్త రూపు ఇచ్చాడు. శభాష్ అనిపించుకుంటున్నాడు.
undefined
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చిత్తాపూర్​లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్నాడు అజయ్ కుమార్. 26 ఏళ్ల నుంచి తన తండ్రి ఓ సైకిల్​ను వినియోగిస్తున్నారు. వ్యవసాయ క్షేత్రానికి, ఇతర ప్రాంతాలకు దానిపైనే వెళ్లేవారు. సైకిల్ పాడవడటం వల్ల మూలన పడేశారు. తండ్రి కోరిక మేరకు అజయ్ ద్విచక్రవాహనం కొనుగోలు చేసి ఇవ్వాలనుకున్నాడు. అప్పుడే తన ఆలోచనలకు కొత్త రూపం ఇచ్చాడు.

తండ్రి వాడిన పాత సైకిల్​కే ఇంజిన్, లిథియం బ్యాటరీ అమర్చాడు. ఇంటర్నెట్​కు అనుసంధానం చేశాడు. మూడు విధాలుగా ప్రయాణించేలా రూపకల్పన చేశాడు. తొక్కడంతో పాటు బ్యాటరీ సహాయంతో నడవడం, బ్యాటరీ డౌన్ అయితే... ఇంధనంతో నడవడం దీని ప్రత్యేకత. సాధారణ ద్విచక్రవాహనాల కంటే పూర్తి స్థాయిలో శబ్ద, వాయు కాలుష్యం లేకుండా ఈ హైబ్రిడ్ సైకిల్​ను తీర్చిదిద్దాడు. ఒక్కసారి ఫుల్​ ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
హైదరాబాద్​లోని ఇండియా సాఫ్ట్ సదస్సులో ఈ హైబ్రిడ్ సైకిల్​ను వివిధ ఐటీ సంస్థలకు పరిచయం చేశారు. అజయ్ తయారు చేసిన ఈ సైకిల్​ను చూసిన బెంగళూరులోని అసెంట్ ఇంజినీరింగ్ టెక్నాలజీ సంస్థ వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల్లో వృథాగా పడి ఉన్న వస్తువులను పునర్వియోగంలోకి తీసుకొచ్చే ఈ సంస్థ... హైబ్రిడ్ సైకిల్​కు అండగా నిలిచింది. తండ్రికి మరిచిపోలేని జ్ఞాపకాన్ని తిరిగిచ్చిన అజయ్.. పనిలో పనిగా పర్యావరణానికి మేలుచేశాడు.

Last Updated : Feb 9, 2019, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.