ETV Bharat / state

Vaccination at burripalem: మహేశ్​ బాబు ఊరికి.. వందకు వంద మార్కులు!

author img

By

Published : Oct 27, 2021, 7:55 PM IST

పుట్టిన ఊరికి ఎంతో కొంత తిరిగిచ్చేయాలి అంటూ.. సినిమాలో చెప్పిన డైలాగును సూపర్​స్టార్​ మహేశ్​బాబు.. నిజజీవితంలోనూ ఆచరించి చూపిస్తున్నారు. తన స్వగ్రామం.. దత్తత గ్రామమైన బుర్రిపాలేనికి ఇప్పటికే చాలా ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం కూడా ఇచ్చారు. దీంతో.. వందకు వంద మార్కులు పడ్డాయి.

vaccination
vaccination

మహేశ్​ బాబు ఊరికి.. వందకు వంద మార్కులు!

"పుట్టిన ఊరికి ఎంతోకొంత తిరిగిచ్చేయాలి.. లేకుంటే లావైపోతాం" ఇదీ.. మహేశ్​ బాబు నటించిన "శ్రీమంతుడు" చిత్రంలోని డైలాగ్. దీన్ని నిజజీవితానికీ అప్లై చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్. తన స్వగ్రామం ఏపీలోని గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను ఆయన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మహేశ్​ తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెంలో.. ఎన్నో మౌలిక వసతులు సహా కరోనా వ్యాక్సినేషన్‌కు సైతం ఏర్పాట్లు చేశారు. ఆయన ఆలోచనకు తోడు.. స్థానికులు చైతన్యంతో ముందుకు రావటంతో.. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామంగా బుర్రిపాలెం నిలిచింది.

కరోనా మహమ్మారిని నిలువరించే పోరులో.. మనదేశం వందకోట్ల టీకా డోసుల అరుదైన మైలురాయిని దాటింది. ఇలాంటి ఘనత సాధించిన సమయంలోనే.. గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామం సైతం వందశాతం వ్యాక్సినేషన్‌తో ప్రత్యేకంగా నిలిచింది. తెనాలి మండలంలోని ఈ గ్రామంలో అర్హులైన వారందరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. పుట్టిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచనతో.. తన సొంత ఖర్చుతో పాటుగా ఆంధ్ర హాస్పటల్ వారి సహకారంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మహేశ్​ బాబు ఏర్పాటు చేశారు.

" గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని హీరో మహేశ్ బాబు ఆయన దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో అర్హులైన అందరికీ వందశాతం వ్యాక్సిన్ వేయించారు. ఇందుకు అందరూ సహకరించారు. మహేశ్ బాబుకు మా ధన్యవాదాలు." -అన్నాబత్తుని జయలక్ష్మీ, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు.

" బుర్రిపాలెం గ్రామస్థులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారు. ఇందుకు మహేశ్ బాబు కుటుంబ సభ్యులు, ఆంధ్ర హాస్పిటల్స్ వారు అందరూ ఎంతో సహకరించారు. " -లలిత ప్రసాద్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు.

బుర్రిపాలెం గ్రామ జనభా 3,160మంది. కాగా.. ఇందులో 18 సంవత్సరాలు పైబడి టీకా వేయించుకోవడానికి అర్హత కలిగిన వారందరూ కొవిడ్ వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేయించుకున్నారు. గణాంకాల ప్రకారం బుర్రిపాలెం గ్రామంలో 100 శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు.

" మా ఊరి కోసం సొంత డబ్బులు వెచ్చించి.. వందశాతం వ్యాక్సిన్ వేయించిన మహేశ్ బాబు గారికి ధన్యవాదాలు. " -శ్రీనివాసరావు, వ్యాక్సినేషన్ నిర్వాహకులు.

" బుర్రిపాలెం గ్రామ జనాభా 3,160 మంది. ఇందులో 18సంవత్సరాల వయసు దాటి వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులైన వారు 2,408. వారిలో 2,338 మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోగా.. దీర్ఘకాలిక రోగాలున్న 74 మంది వ్యాక్సిన్ వేయించుకోలేదు. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు. " -సుగుణమ్మ, ఏఎన్ఎమ్‌

గడిచిన కొంతకాలంగా ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది కరోనా రక్కసి. అలాంటి మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంది బుర్రిపాలెం. తద్వారా.. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: Viral Video: వ్యాక్సిన్​ వేసుకోనని మొండికేసిన వ్యక్తి.. అందరూ కలిసి ఏం చేశారంటే..?

మహేశ్​ బాబు ఊరికి.. వందకు వంద మార్కులు!

"పుట్టిన ఊరికి ఎంతోకొంత తిరిగిచ్చేయాలి.. లేకుంటే లావైపోతాం" ఇదీ.. మహేశ్​ బాబు నటించిన "శ్రీమంతుడు" చిత్రంలోని డైలాగ్. దీన్ని నిజజీవితానికీ అప్లై చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్. తన స్వగ్రామం ఏపీలోని గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను ఆయన దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. మహేశ్​ తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెంలో.. ఎన్నో మౌలిక వసతులు సహా కరోనా వ్యాక్సినేషన్‌కు సైతం ఏర్పాట్లు చేశారు. ఆయన ఆలోచనకు తోడు.. స్థానికులు చైతన్యంతో ముందుకు రావటంతో.. వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామంగా బుర్రిపాలెం నిలిచింది.

కరోనా మహమ్మారిని నిలువరించే పోరులో.. మనదేశం వందకోట్ల టీకా డోసుల అరుదైన మైలురాయిని దాటింది. ఇలాంటి ఘనత సాధించిన సమయంలోనే.. గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామం సైతం వందశాతం వ్యాక్సినేషన్‌తో ప్రత్యేకంగా నిలిచింది. తెనాలి మండలంలోని ఈ గ్రామంలో అర్హులైన వారందరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. పుట్టిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచనతో.. తన సొంత ఖర్చుతో పాటుగా ఆంధ్ర హాస్పటల్ వారి సహకారంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మహేశ్​ బాబు ఏర్పాటు చేశారు.

" గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని హీరో మహేశ్ బాబు ఆయన దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో అర్హులైన అందరికీ వందశాతం వ్యాక్సిన్ వేయించారు. ఇందుకు అందరూ సహకరించారు. మహేశ్ బాబుకు మా ధన్యవాదాలు." -అన్నాబత్తుని జయలక్ష్మీ, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు.

" బుర్రిపాలెం గ్రామస్థులంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నారు. ఇందుకు మహేశ్ బాబు కుటుంబ సభ్యులు, ఆంధ్ర హాస్పిటల్స్ వారు అందరూ ఎంతో సహకరించారు. " -లలిత ప్రసాద్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు.

బుర్రిపాలెం గ్రామ జనభా 3,160మంది. కాగా.. ఇందులో 18 సంవత్సరాలు పైబడి టీకా వేయించుకోవడానికి అర్హత కలిగిన వారందరూ కొవిడ్ వ్యాక్సిన్‌ రెండు డోసులూ వేయించుకున్నారు. గణాంకాల ప్రకారం బుర్రిపాలెం గ్రామంలో 100 శాతం వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు ప్రకటించారు.

" మా ఊరి కోసం సొంత డబ్బులు వెచ్చించి.. వందశాతం వ్యాక్సిన్ వేయించిన మహేశ్ బాబు గారికి ధన్యవాదాలు. " -శ్రీనివాసరావు, వ్యాక్సినేషన్ నిర్వాహకులు.

" బుర్రిపాలెం గ్రామ జనాభా 3,160 మంది. ఇందులో 18సంవత్సరాల వయసు దాటి వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులైన వారు 2,408. వారిలో 2,338 మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోగా.. దీర్ఘకాలిక రోగాలున్న 74 మంది వ్యాక్సిన్ వేయించుకోలేదు. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకున్నారు. " -సుగుణమ్మ, ఏఎన్ఎమ్‌

గడిచిన కొంతకాలంగా ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది కరోనా రక్కసి. అలాంటి మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంది బుర్రిపాలెం. తద్వారా.. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: Viral Video: వ్యాక్సిన్​ వేసుకోనని మొండికేసిన వ్యక్తి.. అందరూ కలిసి ఏం చేశారంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.