ETV Bharat / state

చంద్రబాబుకు 151 కింద నోటీసెలా ఇస్తారు: ఏపీ హైకోర్టు - చంద్రబాబు విశాఖ ఘటనలో హైకోర్టులో వాదనలు

తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనను ఆంధ్రప్రదేశ్​ విశాఖలో అడ్డుకున్న వారిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డీజీపీ గౌతం సవాంగ్​ను ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. సీఆర్​పీసీ 151 కింద చంద్రబాబుకు నోటీసులు ఎలా ఇస్తారని అడిగిన ధర్మాసనం.. ఒకసారి 151 సెక్షన్ ఆర్డర్ చదవాలని సూచించింది.

చంద్రబాబుకు 151 కింద నోటీసెలా ఇస్తారు: ఏపీ హైకోర్టు
చంద్రబాబుకు 151 కింద నోటీసెలా ఇస్తారు: ఏపీ హైకోర్టు
author img

By

Published : Mar 12, 2020, 9:14 PM IST

ఏపీ విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవటంపై దాఖలైన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు విచారించింది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఆర్‌పీసీ 151 కింద నోటీసెలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 151 కింద నోటీసులు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున చర్యలు తీసుకోలేదని డీజీపీ గౌతం సవాంగ్ బదులిచ్చారు.

సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ముందు సీఆర్​పీసీ 151 సెక్షన్​ ఆర్డర్​ చదవాలని డీజీపీకి సూచించారు.

ఏపీ విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవటంపై దాఖలైన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు విచారించింది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఆర్‌పీసీ 151 కింద నోటీసెలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 151 కింద నోటీసులు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున చర్యలు తీసుకోలేదని డీజీపీ గౌతం సవాంగ్ బదులిచ్చారు.

సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ముందు సీఆర్​పీసీ 151 సెక్షన్​ ఆర్డర్​ చదవాలని డీజీపీకి సూచించారు.

ఇదీ చూడండి: కిస్​కా జాగీర్ నహీ.. కిస్​ కా బాప్​కా బీ నహీ: భట్టీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.