ETV Bharat / state

Hero Vishal Visit Tirumala: 'ఆ డబ్బులతో పునీత్​ ఆశయాలను నేను కొనసాగిస్తా..'

author img

By

Published : Nov 3, 2021, 1:47 PM IST

సినీ నటుడు విశాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కన్నడ నటుడు పునీత్ మరణం తీరని లోటని.. పునీత్ చదివిస్తున్న పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు చెప్పారు.

Hero Vishal Visit Tirumala: 'పునీత్​ మరణం తీరని లోటు.. ఆ పిల్లల బాధ్యత ఇకపై నాది'
Hero Vishal Visit Tirumala: 'పునీత్​ మరణం తీరని లోటు.. ఆ పిల్లల బాధ్యత ఇకపై నాది'

తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశాల్ దర్శించుకున్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం తీరని లోటని.. పునీత్ ట్రస్టు ద్వారా చదివిస్తున్న పిల్లల బాధ్యతను ఇకపై తాను తీసుకుంటున్నట్లు నటుడు విశాల్‌ తెలిపారు. మంగళవారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో కొండపైకి చేరుకున్న నటుడు స్వామి సేవలో పాల్గొన్నారు.

తమ కుటుంబంలో ఒకడైన పునీత్​ను కోల్పోవడం బాధాకరమన్న విశాల్.. ఆయన చేసిన మంచి పనులు కొనసాగించాలనే ఉద్దేశంతో పిల్లలను చదివిచే భాద్యతను తీసుకుంటానన్నారు. ఇల్లు కొనేందుకు పెట్టుకున్న డబ్బులను పునీత్‌ ఆశయాలను కొనసాగించేందుకు ఉపయోగిస్తానని చెప్పారు.

తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశాల్ దర్శించుకున్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం తీరని లోటని.. పునీత్ ట్రస్టు ద్వారా చదివిస్తున్న పిల్లల బాధ్యతను ఇకపై తాను తీసుకుంటున్నట్లు నటుడు విశాల్‌ తెలిపారు. మంగళవారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో కొండపైకి చేరుకున్న నటుడు స్వామి సేవలో పాల్గొన్నారు.

తమ కుటుంబంలో ఒకడైన పునీత్​ను కోల్పోవడం బాధాకరమన్న విశాల్.. ఆయన చేసిన మంచి పనులు కొనసాగించాలనే ఉద్దేశంతో పిల్లలను చదివిచే భాద్యతను తీసుకుంటానన్నారు. ఇల్లు కొనేందుకు పెట్టుకున్న డబ్బులను పునీత్‌ ఆశయాలను కొనసాగించేందుకు ఉపయోగిస్తానని చెప్పారు.

ఇదీ చదవండి: Naga Shaurya farm house case: పోలీస్ స్టేషన్‌కు నేడు హీరో నాగశౌర్య తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.