నిత్యావసర సరుకులు కొనేందుకు ఒక్కరే బయటకు రావాలన్న ప్రభుత్వ ఆదేశాలను హైదరాబాద్ ప్రజలు పట్టించుకోవడం లేదు. కూరగాయల మార్కెట్లో భౌతిక దూరం పాటించకుండా గుంపులు, గుంపులుగా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. జీడీమెట్ల, సూరారం కాలనీ ప్రాంతాల్లో మార్కెట్కు కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మార్కెట్ మొత్తం జన సంద్రంగా మారింది. ముఖ్యంగా మాంసాహార దుకాణాల వద్ద ఏ మాత్రం భౌతిక దూరాన్ని పాటించలేదు. పోలీసులు వచ్చినప్పుడు మాత్రమే దూరంగా ఉంటూ... వారు వెళ్లిపోగానే యథాతథంగా ఒక్కచోట చేరారు.
ఇదీ చూడండి: 'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరకు అది రాలేదు'