హైదరాబాద్లోని కిమ్స్ వైద్యులు గుండె మార్పిడి ద్వారా ఓ వ్యక్తి ప్రాణాలను నిలిపారు. లక్డీకపూల్లోని గ్లోబల్ ఆస్పత్రిలో జీవన్మృతుడు (బ్రెయిన్ డెడ్) అయిన ఓ వ్యక్తి గుండె మరో వ్యక్తికి అమర్చారు. ఆస్పత్రిలోనే అతను బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జీవన్దాన్ ద్వారా ఇంకొకరికి ప్రాణం పోయవచ్చని వైద్యులు చెప్పటంతో వారు వెంటనే అంగీకరించారు.
కిమ్స్ ఆస్పత్రిలో మరో వ్యక్తికి గుండె అవసరముందని తెలిసింది. వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది ట్రాఫిక్ పోలీసులకు, ఆస్పత్రికి సమాచారం అందించారు. వెంటనే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి 5.7 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఐదు నిమిషాల్లో గుండెను కిమ్స్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండెను విజయవంతంగా అమర్చారు.