ETV Bharat / state

రుణమాఫీకి 6 వేల కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​లో రుణమాఫీకి నిధులు కేటాయించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు బ్యాంకర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

author img

By

Published : Feb 23, 2019, 4:59 AM IST

Updated : Feb 23, 2019, 7:21 AM IST

రైతు రుణమాఫీ
బడ్జెట్​లో రుణమాఫీకి ప్రాధాన్యత
రాష్ట్రంలో లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీకి అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. ఇందు కోసం బడ్జెట్​లో రైతురుణ మాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించారు. 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
undefined
రూ.25 వేల కోట్లు అంచనా
ఒకే విడతలో రుణమాఫీ సాధ్యం కాదని పలుమార్లు స్పష్టం చేసిన కేసీఆర్... ఈ సారి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీకి రుణాలను మాఫీ చేయడానికి రూ.25 వేల కోట్ల రూపాయలకు పైగా అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దశల్లో రుణమాఫీని అమలు చేశారు. రైతుల నుంచి కొందరు బ్యాంకర్లు వడ్డీ వసూలు చేయడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. కొద్దిపాటి రుణం ఉన్నవారు కూడా నాలుగేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి రైతులకు ఇబ్బంది లేకుండా రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతిపాదనలు
రూ.50 వేల వరకు ఉన్న రుణాలను ఒకే విడతలో మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా కొద్ది పాటి మొత్తం రుణం ఉన్న రైతులకు తక్షణమే పూర్తి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకర్ల ఖాతాలోకి నగదు జమచేయకుండా రైతుబంధు తరహాలో చెక్కులు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు ఉంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది.

ఇవీ చదవండి:బడ్జెట్​తో సమన్యాయం

బడ్జెట్​లో రుణమాఫీకి ప్రాధాన్యత
రాష్ట్రంలో లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామన్న ఎన్నికల హామీకి అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. ఇందు కోసం బడ్జెట్​లో రైతురుణ మాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయించారు. 2018 డిసెంబర్ 11వ తేదీ నాటికి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
undefined
రూ.25 వేల కోట్లు అంచనా
ఒకే విడతలో రుణమాఫీ సాధ్యం కాదని పలుమార్లు స్పష్టం చేసిన కేసీఆర్... ఈ సారి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీకి రుణాలను మాఫీ చేయడానికి రూ.25 వేల కోట్ల రూపాయలకు పైగా అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు దశల్లో రుణమాఫీని అమలు చేశారు. రైతుల నుంచి కొందరు బ్యాంకర్లు వడ్డీ వసూలు చేయడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. కొద్దిపాటి రుణం ఉన్నవారు కూడా నాలుగేళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈసారి రైతులకు ఇబ్బంది లేకుండా రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతిపాదనలు
రూ.50 వేల వరకు ఉన్న రుణాలను ఒకే విడతలో మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా కొద్ది పాటి మొత్తం రుణం ఉన్న రైతులకు తక్షణమే పూర్తి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో బ్యాంకర్ల ఖాతాలోకి నగదు జమచేయకుండా రైతుబంధు తరహాలో చెక్కులు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందు ఉంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాల్సి ఉంది.

ఇవీ చదవండి:బడ్జెట్​తో సమన్యాయం

Intro:Hyd_Tg_48_22_Railway Engineers Conference_Ab_C15
యాంకర్: రైల్వే విధి విధానాలు గూడ్స్ రైలు ప్యాసింజర్ రైల్స్ వేగం పెంపుదలపై ఈ సదస్సులో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా సాంకేతికంగా ఉన్న మార్పులు లోపాలు గుర్తించడం జరుగుతుందని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైలు వేగం నియంత్రించడం పెంచడం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని మెంబర్ అఫ్ రైల్వే ఇంజినీర్ బోర్డ్ న్యూఢిల్లీ విశ్వేష్ చౌబ్ తెలిపారు హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో ఏర్పాటుచేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్మనెంట్ వే ఇంజనీర్స్ పేరుతో అంతర్జాతీయ సాంకేతిక సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని రైల్వే సాంకేతిక పరికరాల ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం ప్రదర్శనలో ఏర్పాటుచేసిన రైల్వే పట్టాలను వాటి పనితీరును నిర్వాహకుల నుంచి అడిగి తెలుసుకున్నారు


Body:Hyd_Tg_48_22_Railway Engineers Conference_Ab_C15


Conclusion:Hyd_Tg_48_22_Railway Engineers Conference_Ab_C15
Last Updated : Feb 23, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.