ETV Bharat / state

ప్రపంచ వ్యాక్సిన్‌ తయారీ రాజధానిగా హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై - governor tamilisai sounder rajan on vaccination awareness

ప్రజల్లో టీకాపై మరింత అవగాహన పెంపొందాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా వ్యాక్సిన్‌పై రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ అవగాహన కల్పించారు. కొవిడ్‌ టీకా కార్యక్రమంలో అందరూ చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

governor tamilisai, national vaccination day
గవర్నర్‌ తమిళిసై, జాతీయ టీకా దినోత్సవం
author img

By

Published : Mar 16, 2021, 6:45 PM IST

ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని గవర్నర్‌ తమిళిసై సౌందర‌రాజన్‌ పేర్కొన్నారు. ప్రజల్లో టీకాపై మరింత అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా వ్యాక్సిన్‌పై గవర్నర్‌ ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు టీకాలపై సరైన అవగాహన తోడ్పడుతుందని తమిళిసై పేర్కొన్నారు.

ఏమరపాటు వద్దు..

ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్‌పై దృష్టి సారించినప్పటికీ.. చిన్న పిల్లలకు ప్రాణాధారమైన ఇతర టీకాల విషయంలో ఏమరపాటు వద్దని గవర్నర్‌ సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ చేపట్టిన దృష్ట్యా... అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి అవసరమైన టీకాల్లో ఎక్కువగా ఇక్కడే తయారవటం తెలుగువారికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

  • జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం -2021 సందర్భంగా టీకాల పై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇది అందరి ఆరోగ్యానికి తోడ్ప డుతుంది.

    ప్రస్తుతం మనం కోవిడ్ వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టినప్పటికీ చిన్న పిల్లలకు ప్రాణాధారమై ఇతర టీకాలు ఇప్పించడం మరిచిపోవద్దు.(1/2) pic.twitter.com/Fs4252uABF

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని గవర్నర్‌ తమిళిసై సౌందర‌రాజన్‌ పేర్కొన్నారు. ప్రజల్లో టీకాపై మరింత అవగాహన పెంపొందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జాతీయ టీకా దినోత్సవం సందర్భంగా వ్యాక్సిన్‌పై గవర్నర్‌ ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు టీకాలపై సరైన అవగాహన తోడ్పడుతుందని తమిళిసై పేర్కొన్నారు.

ఏమరపాటు వద్దు..

ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్‌పై దృష్టి సారించినప్పటికీ.. చిన్న పిల్లలకు ప్రాణాధారమైన ఇతర టీకాల విషయంలో ఏమరపాటు వద్దని గవర్నర్‌ సూచించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ చేపట్టిన దృష్ట్యా... అందరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి అవసరమైన టీకాల్లో ఎక్కువగా ఇక్కడే తయారవటం తెలుగువారికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

  • జాతీయ వ్యాక్సినేషన్ దినోత్సవం -2021 సందర్భంగా టీకాల పై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇది అందరి ఆరోగ్యానికి తోడ్ప డుతుంది.

    ప్రస్తుతం మనం కోవిడ్ వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టినప్పటికీ చిన్న పిల్లలకు ప్రాణాధారమై ఇతర టీకాలు ఇప్పించడం మరిచిపోవద్దు.(1/2) pic.twitter.com/Fs4252uABF

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.