ఎంబీబీఎస్ ప్రవేశాల్లో రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్... కాళోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతికి స్పష్టం చేశారు. ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి వచ్చిన పలు ఫిర్యాదులు, విజ్ఞప్తులపై తమిళిసై స్పందించారు.
విశ్వవిద్యాలయ ఉపకులపతి కరుణాకర్ రెడ్డి రాజ్ భవన్లో గవర్నర్ను కలిశారు. ప్రవేశాల ప్రక్రియ గురించి తెలుసుకున్న గవర్నర్ తమిళిసై... రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు.
ఇదీ చూడండి: రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు