అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలార్జంగ్ మ్యూజియంలో మహిళా చిత్రకళా, వస్త్రాలంకరణ ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరంభించారు. మినిస్ట్రీ కల్చరల్ భారత ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు నిర్వహించారు.
మహిళా కళాకారులు తీర్చిదిద్దిన చిత్రాలను, వస్త్రాలను గవర్నర్ తిలకించారు. వారి కృషిని, ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వయసుతో సంబంధం లేకుండా యువతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తాము రూపొందించిన వాటిని ప్రదర్శించారు. తమ ప్రదర్శనలకు మంచి స్పందన వచ్చిందని... చూసిన వారు మెచ్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'షీటీమ్-భరోసా విభాగం ముఖ్యమంత్రికి మానస పుత్రిక'