ETV Bharat / state

'బయోటెక్‌లో గ్లోబల్​ లీడర్​గా భారత్.. హబ్‌గా హైదరాబాద్'

author img

By

Published : Jul 16, 2020, 9:50 PM IST

కరోనా నివారణకు, వ్యాక్సిన్​ అభివృద్ధికి, ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా రంగాల్లో పరిశోధనలు అవసరమని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. జేఎన్టీయూహెచ్​ ఆధ్వర్యంలో ప్రారంభమైన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని... రాజ్​భవన్​ నుంచి ఆన్​లైన్​ ద్వారా ప్రసంగించారు. బయోటెక్నాలజీ రంగంలో భారత్​ గ్లోబల్​ లీడర్​గా ఎదుగుతోందని గవర్నర్​ చెప్పారు.

governer tamiilisai soundararajan spoke on biotechnology
బయోటెక్నాలజీ రంగంలో భారత్​ గ్లోబల్​ లీడర్​గా ఎదుగుతోంది: గవర్నర్​

బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని, కొవిడ్-19పై మానవాళి పోరాటంలో ఈ పరిశోధనలు కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కొవిడ్-19 నివారణకు, వ్యాక్సిన్ అభివృద్ధికి, చికిత్సకు, ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో 'ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020' అన్న అంశంపై మూడు రోజుల సదస్సు ఇవాళ ప్రారంభమైంది. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్.. రాజ్​భవన్ నుంచి ఆన్​లైన్ ద్వారా ప్రసంగించారు. కొవిడ్ సంక్షోభం “జీవితాలా - జీవనోపాదులా” అన్న సంక్లిష్ట సమస్యను ప్రపంచం ముందుంచిందన్న ఆమె... ఈ సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి, పరిశోధనలకు ఊతమిస్తున్నందున భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్​గా ఎదుగుతోందని చెప్పారు. భారతదేశం ప్రస్థుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని, త్వరలోనే గ్లోబల్ మార్కెట్​లో 20 శాతం వాటాను సాధిస్తుందని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్​గా హైదరాబాద్ ఎదుగుతున్న తీరును గవర్నర్ ప్రశంసించారు. హైదరాబాద్​లోని ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు, పరిశోధనలకు నెలవుగా మారిందని... కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలోనూ ముందంజలో ఉందని అన్నారు.

సైన్స్​లో మహిళా పరిశోధకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న తమిళిసై... ఆ లక్ష్యంతో జేఎన్టీయూ, ఆర్గనైజేషన్ ఫర్ విమెన్ ఇన్ సైన్స్ ఫర్ ది డెవలపింగ్ వరల్డ్ సంస్థతో భాగస్వామ్యం వహించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. జై జవాన్-జై కిసాన్ నినాదానికి జై విజ్ఞాన్ అన్న నినాదాన్ని కూడా ప్రధాని మోదీ జతచేసి సైనికులు, రైతుల సరసన శాస్త్రవేత్తలకు సముచిత గౌరవం కల్పించారని గవర్నర్​ తమిళిసై తెలిపారు.

ఇవీ చూడండి: పరీక్షలు పెంచండి.. ఈటలతో మజ్లిస్ ఎమ్మెల్యేలు

బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలని, కొవిడ్-19పై మానవాళి పోరాటంలో ఈ పరిశోధనలు కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కొవిడ్-19 నివారణకు, వ్యాక్సిన్ అభివృద్ధికి, చికిత్సకు, ఔషధాల తయారీకి బయోటెక్నాలజీ, ఫార్మా, వైద్య రంగాల సమ్మిళిత పరిశోధనలు అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో 'ఫ్రాంటియర్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయో ఇంజినీరింగ్-2020' అన్న అంశంపై మూడు రోజుల సదస్సు ఇవాళ ప్రారంభమైంది. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గవర్నర్.. రాజ్​భవన్ నుంచి ఆన్​లైన్ ద్వారా ప్రసంగించారు. కొవిడ్ సంక్షోభం “జీవితాలా - జీవనోపాదులా” అన్న సంక్లిష్ట సమస్యను ప్రపంచం ముందుంచిందన్న ఆమె... ఈ సమస్యను అధిగమించాలంటే బయోటెక్నాలజీ, బయో ఇంజనీరింగ్ ఇతర ఆధారిత అనుసంధాన రంగాల్లో పరిశోధనలు, అభివృద్ధి మరింత వేగవంతం కావాలని, శాస్త్రవేత్తలు ఆ దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బయోటెక్నాలజీ రంగానికి, పరిశోధనలకు ఊతమిస్తున్నందున భారతదేశం బయోటెక్నాలజీ రంగంలో గ్లోబల్ లీడర్​గా ఎదుగుతోందని చెప్పారు. భారతదేశం ప్రస్థుతం బయోటెక్నాలజీ రంగంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉందని, త్వరలోనే గ్లోబల్ మార్కెట్​లో 20 శాతం వాటాను సాధిస్తుందని తమిళిసై ఆశాభావం వ్యక్తం చేశారు. బయోటెక్నాలజీ, జీవశాస్త్రాల హబ్​గా హైదరాబాద్ ఎదుగుతున్న తీరును గవర్నర్ ప్రశంసించారు. హైదరాబాద్​లోని ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలకు, పరిశోధనలకు నెలవుగా మారిందని... కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధిలోనూ ముందంజలో ఉందని అన్నారు.

సైన్స్​లో మహిళా పరిశోధకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న తమిళిసై... ఆ లక్ష్యంతో జేఎన్టీయూ, ఆర్గనైజేషన్ ఫర్ విమెన్ ఇన్ సైన్స్ ఫర్ ది డెవలపింగ్ వరల్డ్ సంస్థతో భాగస్వామ్యం వహించడం అభినందనీయమని గవర్నర్ అన్నారు. జై జవాన్-జై కిసాన్ నినాదానికి జై విజ్ఞాన్ అన్న నినాదాన్ని కూడా ప్రధాని మోదీ జతచేసి సైనికులు, రైతుల సరసన శాస్త్రవేత్తలకు సముచిత గౌరవం కల్పించారని గవర్నర్​ తమిళిసై తెలిపారు.

ఇవీ చూడండి: పరీక్షలు పెంచండి.. ఈటలతో మజ్లిస్ ఎమ్మెల్యేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.