ETV Bharat / state

GOODS TRAIN DERAILED: పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు.. ఎక్కడంటే?

GOODS TRAIN DERAILED IN AP : ఏపీలోని రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపడుతున్నారు.

author img

By

Published : Nov 9, 2022, 12:00 PM IST

GOODS TRAIN DERAILED IN AP
రైళ్ల రద్దు

GOODS TRAIN DERAILED IN AP : ఆంధ్రప్రదేశ్​లోని రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. కోల్‌కతా-చెన్నై మార్గంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పి.. ఒకవైపు ఒరిగిపోయింది. రైలు ప్రమాదానికి గురైన మార్గంలో మరమ్మతులు కొనసాగుతుండటంతో.. సింగిల్‌ ట్రాక్‌పైనే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఫలితంగా కోల్‌కతా-చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

గూడ్స్​ రైలు పట్టాలు తప్పడంతో... 9 ప్యాసింజర్​ రైళ్లు రద్దు కాగా 2 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ మధ్య రైళ్లు రద్దయ్యాయి. అలాగే గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు.. విజయవాడ-గుంటూరు రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు కాగా.. విజయవాడ-రాజమహేంద్రవరం రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.

GOODS TRAIN DERAILED IN AP : ఆంధ్రప్రదేశ్​లోని రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. కోల్‌కతా-చెన్నై మార్గంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో రైలు పట్టాలు తప్పి.. ఒకవైపు ఒరిగిపోయింది. రైలు ప్రమాదానికి గురైన మార్గంలో మరమ్మతులు కొనసాగుతుండటంతో.. సింగిల్‌ ట్రాక్‌పైనే రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఫలితంగా కోల్‌కతా-చెన్నై మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

గూడ్స్​ రైలు పట్టాలు తప్పడంతో... 9 ప్యాసింజర్​ రైళ్లు రద్దు కాగా 2 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. విజయవాడ-లింగంపల్లి రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ మధ్య రైళ్లు రద్దయ్యాయి. అలాగే గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు.. విజయవాడ-గుంటూరు రైళ్లు రద్దయ్యాయి. కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు కాగా.. విజయవాడ-రాజమహేంద్రవరం రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.