ETV Bharat / state

మెతుకు సీమను తాకనున్న గోదారమ్మ

మెతుకు సీమకు వానాకాలంలోపే కొండపోచమ్మ జలాశయానికి నీళ్లు రానున్నాయి. అక్కడ జరుగుతున్న ఎత్తిపోతల విద్యుత్తు పనులపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు ఫోన్‌ చేసి సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. విద్యుత్తు శాఖ పనితీరుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

author img

By

Published : Apr 24, 2020, 5:48 AM IST

కొండ పోచమ్మ జలాశయం
కొండ పోచమ్మ జలాశయం

మెతుకు సీమలో గోదారమ్మ రాకకు వేళయింది.. నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీడు భూములను తడపడానికి గోదారి కాలు మోపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రంగనాయక సాగర్‌ వరకు చేరుకున్న గోదావరి జలాలను... వానాకాలం లోపు కొండపోచమ్మ సాగర్‌ జలాశయానికి ఎత్తిపోసేందుకు విద్యుత్తు శాఖ చేపట్టిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని అక్కారం, మర్కూక్‌ పంపుహౌస్‌లను ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

ఎత్తిపోతల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ రెండు ఎత్తిపోతల్లోని పంపులు, ఇతర పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్తు శాఖ మొదటి నుంచీ అప్పగించిన పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేస్తోందని, మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తోందని సీఎం అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులతో నిర్మిస్తున్న అక్కారం, 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులతో నిర్మిస్తున్న మర్కూక్‌ పంపుహౌస్‌ల పనులను ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా వ్యక్తిగతదూరం పాటిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వర్షాకాలంలో మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ జలాశయాలను నింపాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. నాలుగు బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని, తుది పరీక్షలు పూర్తి చేసి నీటిని ఎత్తిపోయనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, సంచాలకులు జె.సూర్యప్రకాశ్‌, ఈడీ పీవీ ప్రభాకర్‌రావు, పర్యవేక్షక ఇంజినీర్లు ఆంజనేయులు, వేణు పాల్గొన్నారు.

ప్రత్యేక అనుమతులతో చేరుకున్న నిపుణుల బృందం

పనులు పరిశీలిస్తున్న ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు
పనులు పరిశీలిస్తున్న ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు

పంపుహౌస్‌ల కేబుల్‌ పనులు చేపట్టిన రాహుల్‌ కేబుల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ నిపుణులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రత్యేక అనుమతులతో ఈ నెల 21వ తేదీన సిద్దిపేటకు వచ్చారు. వారు ముంబయిలో చిక్కుకుపోగా పనుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు డీజీపీ మహేందర్‌రెడ్డికి సహకారం అందించాలని లేఖ రాశారు. స్పందించిన డీజీపీ మహేందర్​ రెడ్డి మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసి, ఫోన్‌ చేసి నిపుణులు వేగంగా చేరుకునేలా అనుమతులివ్వాలని కోరారు. మహారాష్ట్ర డీజీపీ అనుమతులతో నిపుణులు సరైన సమయంలో సిద్ధిపేటకు చేరుకున్నారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

మెతుకు సీమలో గోదారమ్మ రాకకు వేళయింది.. నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీడు భూములను తడపడానికి గోదారి కాలు మోపనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని రంగనాయక సాగర్‌ వరకు చేరుకున్న గోదావరి జలాలను... వానాకాలం లోపు కొండపోచమ్మ సాగర్‌ జలాశయానికి ఎత్తిపోసేందుకు విద్యుత్తు శాఖ చేపట్టిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని అక్కారం, మర్కూక్‌ పంపుహౌస్‌లను ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడారు.

ఎత్తిపోతల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ రెండు ఎత్తిపోతల్లోని పంపులు, ఇతర పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్తు శాఖ మొదటి నుంచీ అప్పగించిన పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేస్తోందని, మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తోందని సీఎం అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులతో నిర్మిస్తున్న అక్కారం, 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులతో నిర్మిస్తున్న మర్కూక్‌ పంపుహౌస్‌ల పనులను ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా వ్యక్తిగతదూరం పాటిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వర్షాకాలంలో మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ జలాశయాలను నింపాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. నాలుగు బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని, తుది పరీక్షలు పూర్తి చేసి నీటిని ఎత్తిపోయనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, సంచాలకులు జె.సూర్యప్రకాశ్‌, ఈడీ పీవీ ప్రభాకర్‌రావు, పర్యవేక్షక ఇంజినీర్లు ఆంజనేయులు, వేణు పాల్గొన్నారు.

ప్రత్యేక అనుమతులతో చేరుకున్న నిపుణుల బృందం

పనులు పరిశీలిస్తున్న ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు
పనులు పరిశీలిస్తున్న ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకర్​రావు

పంపుహౌస్‌ల కేబుల్‌ పనులు చేపట్టిన రాహుల్‌ కేబుల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ నిపుణులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రత్యేక అనుమతులతో ఈ నెల 21వ తేదీన సిద్దిపేటకు వచ్చారు. వారు ముంబయిలో చిక్కుకుపోగా పనుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు డీజీపీ మహేందర్‌రెడ్డికి సహకారం అందించాలని లేఖ రాశారు. స్పందించిన డీజీపీ మహేందర్​ రెడ్డి మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసి, ఫోన్‌ చేసి నిపుణులు వేగంగా చేరుకునేలా అనుమతులివ్వాలని కోరారు. మహారాష్ట్ర డీజీపీ అనుమతులతో నిపుణులు సరైన సమయంలో సిద్ధిపేటకు చేరుకున్నారు.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.