ETV Bharat / state

ఆ నీటిని మేమే వాడుకుంటాం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

author img

By

Published : Jul 4, 2020, 6:47 AM IST

పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాబేసిన్‌కు మళ్లించడం వల్ల ఆదా అయ్యే నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ప్రాజెక్టులకు వినియోగించుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ఈ నీటిని తమకు కేటాయించాలని గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ గట్టిగా కోరుతుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా నదీయాజమాన్యబోర్డుకు రాసిన లేఖలో తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు ఈ నీటిని వాడుకోనున్నట్లు పేర్కొనడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Godavari river redirection water share is ours said by Andrapradesh Government
గోదావరి మళ్లింపు వాటా మాదే

ఇటీవల జరిగిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశంలో గోదావరి మళ్లింపు వాటా అంశంపై చర్చ జరిగింది. వీటితోపాటు చర్చించిన అన్ని అంశాలపై మినిట్స్‌ తయారు చేసిన బోర్డు రెండు రాష్ట్రాలకు పంపింది. సమావేశంలో చర్చించినదానికి, మినిట్స్‌లో రాసిన దానికి చాలా వ్యత్యాసాలున్నాయని ఆంధ్రప్రదేశ్‌ భారీగా మార్పులు సూచించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు రెండురోజుల క్రితం సుదీర్ఘ లేఖ రాశారు.

ఆ 45 టీఎంసీలు మాకే

పోలవరం నిర్మాణం వల్ల కృష్ణాలోకి మళ్లించే నీటిలో 45 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవాలనుకోవడంపై 2018 ఫిబ్రవరిలో కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ వద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి కృష్ణాబోర్డు రెండు రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రానికి పంపుతుందని కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌-2 ముందు తెలంగాణ స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిందని, ట్రైబ్యునల్‌ కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుందని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశంలో చెప్పినా ఈఅంశం బోర్డుపంపిన మినిట్స్‌లో రికార్డు కాలేదు. పోలవరం ప్రాజెక్టు, దీని కమాండ్‌ ఏరియా మొత్తం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. పోలవరం నుంచి కృష్ణాలోకి మళ్లించే 80 టీఎంసీల వల్ల నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీరు ఆమేరకు తగ్గిపోతుంది. ఇలా మళ్లించే నీటిలో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకు, 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఏపీకి ఉంది. ఈ వాటా నీటిని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మిగులు జలాల ఆధారంగా 150.5 టీఎంసీలతో చేపట్టిన ప్రాజెక్టులకు వాడుకుంటాం. ఇది పోనూ మిగులు జలాల ప్రాజెక్టులకు 105.50 టీఎంసీలు అవసరమవుతాయి. తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీల నీటిని కృష్ణాబేసిన్‌కు మళ్లిస్తోంది. ఇలా మళ్లించే నీటిలో ఏ రాష్ట్రాన్నీ వాటా కోరకుండా ఆపలేరని బచావత్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది. దీని ప్రకారం చాలా ఎక్కువ వాటా వస్తుంది. ఈ అంశాలు, వివరణలను మినిట్స్‌లో పొందుపరచాలని, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించేవరకు ముందుకెళ్లరాదని తెలంగాణకు సూచించాలని పేర్కొంది.

క్యారీఓవర్‌ నీటి వినియోగంపై

* ఒక సంవత్సరం కేటాయించిన నీటిలో కొంత నిల్వ ఉంచుకుని తదుపరి సంవత్సరం వాడుకోవడం(క్యారీఓవర్‌)పై కూడా ఆంధ్రప్రదేశ్‌ వివరంగా లేఖలో పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ మహారాష్ట్ర, కర్ణాటకల కంటే ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువగా నష్టపోతుందని భావించి మిగులు జలాలున్నప్పుడు నాగార్జునసాగర్‌, శ్రీశైలంలో నిల్వ ఉంచుకొని తదుపరి సంవత్సరం వాడుకోవడానికి అవకాశం కల్పించింది. కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఈ ఏర్పాటులో ఎలాంటి మార్పు చేయలేదు. 75 శాతం లభ్యతకు మించి వచ్చే నీటిలో 150 టీఎంసీలు నిల్వ చేసి క్యారీఓవర్‌ కింద వాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. 65 శాతం నీటి లభ్యత కింద 30 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత కింద 120 టీఎంసీలు నిల్వ చేసుకుని వాడుకోవడంతోపాటు, 2,578 టీఎంసీలకు మించి వచ్చే నీటిని వాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ తీర్పును కేంద్రం ఇంకా గెజిట్‌లో ప్రచురించలేదు. కాబట్టి ప్రస్తుతం మొదటి ట్రైబ్యునల్‌ తీర్పే ఇంకా ఆచరణలో ఉంది. మొదటి ట్రైబ్యునల్‌ 2,130 టీఎంసీలకు మించి వచ్చే నీటిని క్యారీఓవర్‌గా నిల్వ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఏపీ పునర్విభజన తర్వాత ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందుకు వచ్చింది. ఇందులో క్యారీఓవర్‌ అంశం ఉంది. కాబట్టి ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. తెలంగాణ కోరినట్లు 2019-20లో కేటాయించి వినియోగించుకోలేని నీటిని 2020-21లో వాడుకుంటామనడం సరైంది కాదు. ఈ విషయాన్నే మీటింగ్‌లో చెప్పాం. మినిట్స్‌లో ఇది రికార్డు కాలేదు.

* విద్యుత్తు పంపిణీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమగట్టు కాలువలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌లోని గురురాఘవేంద్ర, పులికనుమ, శివభాష్యం ఎత్తిపోతల, మున్నేరు, ఆర్డీఎస్‌ కుడికాలువలకు సంబంధించి సమావేశంలో తాము చెప్పినదానికి, మినిట్స్‌లో పేర్కొన్నదానికి వ్యత్యాసాలున్నాయంటూ అన్ని అంశాలపైన వివరంగా లేఖలో పేర్కొంది. బోర్డు పంపిన మినిట్స్‌పై ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇటీవల జరిగిన కృష్ణానదీ యాజమాన్యబోర్డు సమావేశంలో గోదావరి మళ్లింపు వాటా అంశంపై చర్చ జరిగింది. వీటితోపాటు చర్చించిన అన్ని అంశాలపై మినిట్స్‌ తయారు చేసిన బోర్డు రెండు రాష్ట్రాలకు పంపింది. సమావేశంలో చర్చించినదానికి, మినిట్స్‌లో రాసిన దానికి చాలా వ్యత్యాసాలున్నాయని ఆంధ్రప్రదేశ్‌ భారీగా మార్పులు సూచించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు రెండురోజుల క్రితం సుదీర్ఘ లేఖ రాశారు.

ఆ 45 టీఎంసీలు మాకే

పోలవరం నిర్మాణం వల్ల కృష్ణాలోకి మళ్లించే నీటిలో 45 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకోవాలనుకోవడంపై 2018 ఫిబ్రవరిలో కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ వద్ద చర్చ జరిగింది. దీనికి సంబంధించి కృష్ణాబోర్డు రెండు రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్రానికి పంపుతుందని కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే కృష్ణా జలవివాద ట్రైబ్యునల్‌-2 ముందు తెలంగాణ స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ కేస్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిందని, ట్రైబ్యునల్‌ కూడా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుందని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశంలో చెప్పినా ఈఅంశం బోర్డుపంపిన మినిట్స్‌లో రికార్డు కాలేదు. పోలవరం ప్రాజెక్టు, దీని కమాండ్‌ ఏరియా మొత్తం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. పోలవరం నుంచి కృష్ణాలోకి మళ్లించే 80 టీఎంసీల వల్ల నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు విడుదల చేసే నీరు ఆమేరకు తగ్గిపోతుంది. ఇలా మళ్లించే నీటిలో 35 టీఎంసీలు కర్ణాటక, మహారాష్ట్రకు, 45 టీఎంసీల వాటా ఉమ్మడి ఏపీకి ఉంది. ఈ వాటా నీటిని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మిగులు జలాల ఆధారంగా 150.5 టీఎంసీలతో చేపట్టిన ప్రాజెక్టులకు వాడుకుంటాం. ఇది పోనూ మిగులు జలాల ప్రాజెక్టులకు 105.50 టీఎంసీలు అవసరమవుతాయి. తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీల నీటిని కృష్ణాబేసిన్‌కు మళ్లిస్తోంది. ఇలా మళ్లించే నీటిలో ఏ రాష్ట్రాన్నీ వాటా కోరకుండా ఆపలేరని బచావత్‌ ట్రైబ్యునల్‌ పేర్కొంది. దీని ప్రకారం చాలా ఎక్కువ వాటా వస్తుంది. ఈ అంశాలు, వివరణలను మినిట్స్‌లో పొందుపరచాలని, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించేవరకు ముందుకెళ్లరాదని తెలంగాణకు సూచించాలని పేర్కొంది.

క్యారీఓవర్‌ నీటి వినియోగంపై

* ఒక సంవత్సరం కేటాయించిన నీటిలో కొంత నిల్వ ఉంచుకుని తదుపరి సంవత్సరం వాడుకోవడం(క్యారీఓవర్‌)పై కూడా ఆంధ్రప్రదేశ్‌ వివరంగా లేఖలో పేర్కొంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ మహారాష్ట్ర, కర్ణాటకల కంటే ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువగా నష్టపోతుందని భావించి మిగులు జలాలున్నప్పుడు నాగార్జునసాగర్‌, శ్రీశైలంలో నిల్వ ఉంచుకొని తదుపరి సంవత్సరం వాడుకోవడానికి అవకాశం కల్పించింది. కృష్ణా ట్రైబ్యునల్‌-2 ఈ ఏర్పాటులో ఎలాంటి మార్పు చేయలేదు. 75 శాతం లభ్యతకు మించి వచ్చే నీటిలో 150 టీఎంసీలు నిల్వ చేసి క్యారీఓవర్‌ కింద వాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. 65 శాతం నీటి లభ్యత కింద 30 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత కింద 120 టీఎంసీలు నిల్వ చేసుకుని వాడుకోవడంతోపాటు, 2,578 టీఎంసీలకు మించి వచ్చే నీటిని వాడుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ తీర్పును కేంద్రం ఇంకా గెజిట్‌లో ప్రచురించలేదు. కాబట్టి ప్రస్తుతం మొదటి ట్రైబ్యునల్‌ తీర్పే ఇంకా ఆచరణలో ఉంది. మొదటి ట్రైబ్యునల్‌ 2,130 టీఎంసీలకు మించి వచ్చే నీటిని క్యారీఓవర్‌గా నిల్వ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఏపీ పునర్విభజన తర్వాత ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల అంశం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందుకు వచ్చింది. ఇందులో క్యారీఓవర్‌ అంశం ఉంది. కాబట్టి ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. తెలంగాణ కోరినట్లు 2019-20లో కేటాయించి వినియోగించుకోలేని నీటిని 2020-21లో వాడుకుంటామనడం సరైంది కాదు. ఈ విషయాన్నే మీటింగ్‌లో చెప్పాం. మినిట్స్‌లో ఇది రికార్డు కాలేదు.

* విద్యుత్తు పంపిణీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్తరామదాసు, మిషన్‌ భగీరథ, తుమ్మిళ్ల ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమగట్టు కాలువలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్‌లోని గురురాఘవేంద్ర, పులికనుమ, శివభాష్యం ఎత్తిపోతల, మున్నేరు, ఆర్డీఎస్‌ కుడికాలువలకు సంబంధించి సమావేశంలో తాము చెప్పినదానికి, మినిట్స్‌లో పేర్కొన్నదానికి వ్యత్యాసాలున్నాయంటూ అన్ని అంశాలపైన వివరంగా లేఖలో పేర్కొంది. బోర్డు పంపిన మినిట్స్‌పై ఇంత పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం గతంలో ఎప్పుడూ జరగలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.