ETV Bharat / state

హైదరాబాద్​లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు - జీహెచ్​ఎంసీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్​ నగర వ్యాప్తంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్​ బొంతు రామ్మోహన్​, మెట్రో కార్యాలయంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డిలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

Glorious Celebrations of Formation day of Telangana in Hyderabad
హైదరాబాద్​లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
author img

By

Published : Jun 2, 2020, 5:33 PM IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ లోకేష్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బేగంపేట్​లోని మెట్రో రైల్ భవన్​లోని​ కార్యాలయంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ లోకేష్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. బేగంపేట్​లోని మెట్రో రైల్ భవన్​లోని​ కార్యాలయంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఇదీ చూడండి : ఆరేళ్లలో కేసీఆర్ చేసింది శూన్యం: జీవన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.