ETV Bharat / state

'హైదరాబాద్​ను చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతాం'

author img

By

Published : Nov 4, 2019, 11:22 PM IST

హైదరాబాద్ రోడ్లపై చెత్తను సమూలంగా నిర్మూలించేందుకు జీహెచ్​ఎంసీ స్పెషల్ డ్రైవ్​ను చేపట్టింది. ఇళ్లలో పనికిరాని వస్తువులను సేకరణ కార్యక్రమాన్ని సోమాజిగూడలో మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.

చెత్తలేని నగరంగా హైదరాబాద్

ప‌నికిరాని వ‌స్తువుల సేక‌ర‌ణ‌ కోసం... జీహెచ్​ఎంసీ చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నిరుప‌యోగంగా ఉన్న వ‌స్తువుల‌ను ఇంటి వ‌ద్ద నుంచే సేక‌రిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సోమాజిగూడ‌లో... నగర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిశీలించారు. ఈ నెల 12 వరకు చేపట్టనున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ విధానం ద్వారా ఇప్పటి వ‌ర‌కు 42 మెట్రిక్ ట‌న్నులకుపైగా వ్యర్థప‌దార్థాల‌ు సేక‌రించారు. ఇళ్లలో ప‌నికిరాని వ‌స్తువులను బ‌హిరంగ ప్రదేశాల్లో వేయ‌కుండా జీహెచ్​ఎంసీకి అంద‌జేయాల‌ని మేయర్ విజ్ఞప్తి చేశారు. ప‌నికిరాని వ‌స్తువుల‌న్నింటినీ ర‌హ‌దారుల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేయడం వల్ల... రోడ్లపై మురుగునీరు చేరుతోందన్నారు.

చెత్తలేని నగరంగా హైదరాబాద్

ఇవీచూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ

ప‌నికిరాని వ‌స్తువుల సేక‌ర‌ణ‌ కోసం... జీహెచ్​ఎంసీ చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నిరుప‌యోగంగా ఉన్న వ‌స్తువుల‌ను ఇంటి వ‌ద్ద నుంచే సేక‌రిస్తోంది. ఈ కార్యక్రమాన్ని సోమాజిగూడ‌లో... నగర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిశీలించారు. ఈ నెల 12 వరకు చేపట్టనున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ విధానం ద్వారా ఇప్పటి వ‌ర‌కు 42 మెట్రిక్ ట‌న్నులకుపైగా వ్యర్థప‌దార్థాల‌ు సేక‌రించారు. ఇళ్లలో ప‌నికిరాని వ‌స్తువులను బ‌హిరంగ ప్రదేశాల్లో వేయ‌కుండా జీహెచ్​ఎంసీకి అంద‌జేయాల‌ని మేయర్ విజ్ఞప్తి చేశారు. ప‌నికిరాని వ‌స్తువుల‌న్నింటినీ ర‌హ‌దారుల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేయడం వల్ల... రోడ్లపై మురుగునీరు చేరుతోందన్నారు.

చెత్తలేని నగరంగా హైదరాబాద్

ఇవీచూడండి: ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష... సమ్మెపై కీలకచర్చ

TG_Hyd_50_04_GHMC_Spl_Drive_Good_Respance_AV_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చాయి. ( ) ప‌నికిరాని వ‌స్తువుల సేక‌ర‌ణ‌కై జిహెచ్ఎంసి చేప‌ట్టిన స్పెష‌ల్ డ్రైవ్‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. త‌మ ఇళ్లలో ఉన్న నిరుప‌యోగ వ‌స్తువుల‌ను ఎక్కడ వేయాలో తెలియ‌క‌, ఇంట్లో ఉంచుకోలేక ఇబ్బందులు ప‌డుతున్న న‌గ‌ర‌వాసుల‌కు ఇంటి వ‌ద్ద నుండే సేక‌రించే కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి చేపట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి త‌మ ఇళ్లలో ఉన్న నిరుప‌యోగ వ‌స్తువుల‌ను పెద్ద ఎత్తున అంద‌జేస్తున్నారు. ఈ నెల12వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఈ డ్రైవ్‌లో ఇళ్లలో వృథాగా ఉన్న పాత వ‌స్తువులు, కూల‌ర్లు, ప‌రుపులు, మెత్తలు, ప‌నిచేయ‌ని ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, విరిగిన కుర్చీలతో పాటు ఇత‌ర నిరుప‌యోగ వ‌స్తువుల‌ను జీహెచ్‌ఎంసీ సిబ్బంది సేక‌రిస్తున్నారు. గ‌త రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వ‌ర‌కు మొత్తం 42.336 మెట్రిక్ ట‌న్నుల వ్యర్థప‌దార్థాల‌ను సేక‌రించారు. నేడు ఒక్కరోజే 1.883 ఎల‌క్ట్రానిక్ వ్యర్థాలు, 7.821మెట్రిక్ ట‌న్నుల విరిగిన ఫ‌ర్నీచ‌ర్లు, 4.073 మెట్రిక్ ట‌న్నుల ప‌నికిరాని ప‌రుపులు, మెత్తలు, 1.651 మెట్రిక్ ట‌న్నుల ప్లాస్టిక్ సామాను, 0.005 మెట్రిక్ ట‌న్నుల హానిక‌ర వ‌స్తువులు, 5.245 మెట్రిక్ ట‌న్నుల ఇత‌ర వస్తువుల‌ను జిహెచ్ఎంసి సేక‌రించింది. ఖైర‌తాబాద్ స‌ర్కిల్ సోమాజిగూడ‌లోని దుర్గాన‌గ‌ర్‌లో నిర్వహించిన నిరుప‌యోగ వ‌స్తువుల‌ సేక‌ర‌ణ కార్యక్రమాన్ని న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ప‌రిశీలించారు. త‌మ ఇళ్లలోని ప‌నికిరాని వ‌స్తువులను బ‌హిరంగ ప్రదేశాల్లో వేయ‌కుండా జిహెచ్ఎంసికి అంద‌జేయాల‌ని న‌గ‌ర‌వాసుల‌కు మేయర్ విజ్ఞప్తి చేశారు. న‌గ‌రంలో ఈ ప‌నికిరాని వ‌స్తువుల‌న్నింటిని ర‌హ‌దారుల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, నాలాల్లో వేస్తున్నారని, త‌ద్వారా నాలాలు, మ్యాన్‌హోళ్లు జామ్ కావ‌డంతో రోడ్లపై మురుగునీరు పొంగ‌డం, నాలాల ద్వారా నీరు స‌క్రమంగా ప్రవ‌హించ‌కుండా ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం అవుతున్నాయ‌ని మేయ‌ర్ పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.