ETV Bharat / state

సీఎం నిర్ణయంపై పారిశుద్ధ్య కార్మికుల హర్షం - GHMC THANKFUL TO KCR

మున్సిపల్ కార్మికులకు నిలిపిన వేతనం విడుదల చేయడమే కాకుండా సీఎం ప్రోత్సాహకంగా అదనంగా నిధులు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం. జీహెచ్​ఎంసీ పరిధిలోని సుమారు 18 వేల మంది కార్మికులకు వర్తించనుంది. ఈ సందర్భంగా మహా నగర ప్రథమ పౌరుడు రామ్మోహన్ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ నగదు ప్రోత్సాహం
పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ నగదు ప్రోత్సాహం
author img

By

Published : Apr 7, 2020, 8:12 AM IST

కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడంలో విశిష్ట సేవలు అందిస్తోన్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిలిపేసిన వేతనంతో మంజూరు చేశారు. అదనంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి 7 వేల 5 వందల రూపాయలను సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహకంగా ప్రకటించారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తోన్న సుమారు 18 వేల 550 మంది పారిశుద్ధ్య కార్మికులు, 2 వేల 375 మంది ఎంటమాలజి సిబ్బంది, 1,100 మంది ఎన్ ఫోర్స్​మెంట్, విజిలెన్స్ విభాగానికు చెందిన సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌కి మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ బాబా ఫసియుద్దీన్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టడంలో విశిష్ట సేవలు అందిస్తోన్న జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిలిపేసిన వేతనంతో మంజూరు చేశారు. అదనంగా ప్రతి పారిశుద్ధ్య కార్మికునికి 7 వేల 5 వందల రూపాయలను సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహకంగా ప్రకటించారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో జీహెచ్‌ఎంసీ పరిధిలో పనిచేస్తోన్న సుమారు 18 వేల 550 మంది పారిశుద్ధ్య కార్మికులు, 2 వేల 375 మంది ఎంటమాలజి సిబ్బంది, 1,100 మంది ఎన్ ఫోర్స్​మెంట్, విజిలెన్స్ విభాగానికు చెందిన సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌కి మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ మహమ్మద్‌ బాబా ఫసియుద్దీన్‌ ధన్యవాదాలు తెలియజేశారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో విస్తరిస్తోన్న కరోనా.. 364 కేసులు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.