ETV Bharat / state

వ్యాక్సిన్ కోసం ఎగబడిన సిబ్బంది... నిబంధనలు బేఖాతరు

author img

By

Published : Apr 12, 2021, 3:29 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో చాపకింద నీరులా కరోనా మహమ్మారి విస్తరిస్తుంటే జీహెచ్​ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సిబ్బంది కోసం వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభించగా కొవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులుగా వచ్చారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో జరిగింది.

ghmc employees negligence to maintain physical distance at  vaccine centre
వ్యాక్సినేషన్​ కేంద్రం వద్ద నిబంధలు పాటించని పారిశుద్ధ్య సిబ్బంది

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేయాల్సిన జీహెచ్​ఎంసీ సిబ్బంది నియమాలను పాటించడం లేదు. వ్యాక్సిన్ కేంద్రానికి ఒకేసారి తరలివచ్చిన సిబ్బంది భౌతికదూరాన్ని మరచి గుంపులుగా గుమిగూడారు. కొవిడ్ రెండోదశలో పంజా విసురుతుంటే జీహెచ్​ఎంసీ సిబ్బంది ఇలా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం వద్ద జరిగింది.

ghmc employees negligence to maintain physical distance at  vaccine centre
వ్యాక్సిన్​ కేంద్రం వద్ద గుమిగూడిన పారిశుద్ధ్య సిబ్బంది

భౌతికదూరం పాటించడం లేదు..

ముఖ్యంగా హైదరాబాద్​లో కొవిడ్ రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తుండగా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. జరిమానా విధించడం, మాస్కులు పంపిణీ చేస్తున్నా... పారిశుద్ధ్య సిబ్బంది, సూపర్​వైజర్లు మాత్రం మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేంద్రానికి వచ్చిన కొంతమంది పోలీసు సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించకుండా వ్యాక్సిన్ సిబ్బందిపై దురుసుగా వ్యవహరించారు.

ghmc employees negligence to maintain physical distance at  vaccine centre
వ్యాక్సిన్​ కేంద్రం వద్ద గుమిగూడిన పారిశుద్ధ్య సిబ్బంది

సిబ్బంది నిర్లక్ష్యం

టీకాలు వేయించుకునేందుకు వచ్చిన జీహెచ్​ఎంసీ సిబ్బంది నిబంధనలు గాలికొదిలేయడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్​మెట్, గాంధీనగర్, ముషీరాబాద్, బోలక్ పూర్, కవాడిగూడ డివిజన్ అనేక ప్రాంతాల్లోని వ్యాపార సంస్థల వద్ద ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...!

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కృషి చేయాల్సిన జీహెచ్​ఎంసీ సిబ్బంది నియమాలను పాటించడం లేదు. వ్యాక్సిన్ కేంద్రానికి ఒకేసారి తరలివచ్చిన సిబ్బంది భౌతికదూరాన్ని మరచి గుంపులుగా గుమిగూడారు. కొవిడ్ రెండోదశలో పంజా విసురుతుంటే జీహెచ్​ఎంసీ సిబ్బంది ఇలా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం వద్ద జరిగింది.

ghmc employees negligence to maintain physical distance at  vaccine centre
వ్యాక్సిన్​ కేంద్రం వద్ద గుమిగూడిన పారిశుద్ధ్య సిబ్బంది

భౌతికదూరం పాటించడం లేదు..

ముఖ్యంగా హైదరాబాద్​లో కొవిడ్ రోజురోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తుండగా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. జరిమానా విధించడం, మాస్కులు పంపిణీ చేస్తున్నా... పారిశుద్ధ్య సిబ్బంది, సూపర్​వైజర్లు మాత్రం మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేంద్రానికి వచ్చిన కొంతమంది పోలీసు సిబ్బంది భౌతిక దూరాన్ని పాటించకుండా వ్యాక్సిన్ సిబ్బందిపై దురుసుగా వ్యవహరించారు.

ghmc employees negligence to maintain physical distance at  vaccine centre
వ్యాక్సిన్​ కేంద్రం వద్ద గుమిగూడిన పారిశుద్ధ్య సిబ్బంది

సిబ్బంది నిర్లక్ష్యం

టీకాలు వేయించుకునేందుకు వచ్చిన జీహెచ్​ఎంసీ సిబ్బంది నిబంధనలు గాలికొదిలేయడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్​మెట్, గాంధీనగర్, ముషీరాబాద్, బోలక్ పూర్, కవాడిగూడ డివిజన్ అనేక ప్రాంతాల్లోని వ్యాపార సంస్థల వద్ద ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: రాగల 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.