ETV Bharat / state

వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలపై జీహెచ్​ఎంసీ కమిషనర్ సమీక్ష​

వర్షం వల్ల ట్రాఫిక్​కు ఏర్పడుతున్న అంతరాయానికి ప్రత్యామ్నాయ చర్యలపై జీహెచ్​ఎంసీ అధికారులు దృష్టి సారించారు. ఐటీ కారిడార్​లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

author img

By

Published : Jun 29, 2019, 11:20 AM IST

వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలపై జీహెచ్​ఎంసీ కమిషనర్ సమీక్ష​
వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలపై జీహెచ్​ఎంసీ కమిషనర్ సమీక్ష​

వర్షం పడినప్పుడు ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కిలోమీటర్​ ప్రయాణానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ చర్యలపై జీహెచ్​ఎంసీ అధికారులు దృష్టి సారించారు. వర్షాల వల్ల ఐటీ కారిడార్​లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ సమావేశమయ్యారు. ఈ భేటీలో సైబరాబాద్​ సీపీ సజ్జనార్, ట్రాఫిక్​, మెట్రో, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వాహనాల దారి మళ్లింపుతో పాటు.. నిర్దేశించిన సమయంలోనే వాహనాలు బయటకు వచ్చేలా తగిన చర్యలు తీసుకునేలా చర్చిస్తున్నారు.

వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యలపై జీహెచ్​ఎంసీ కమిషనర్ సమీక్ష​

వర్షం పడినప్పుడు ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కిలోమీటర్​ ప్రయాణానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయ చర్యలపై జీహెచ్​ఎంసీ అధికారులు దృష్టి సారించారు. వర్షాల వల్ల ఐటీ కారిడార్​లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ సమావేశమయ్యారు. ఈ భేటీలో సైబరాబాద్​ సీపీ సజ్జనార్, ట్రాఫిక్​, మెట్రో, ఆర్టీసీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వాహనాల దారి మళ్లింపుతో పాటు.. నిర్దేశించిన సమయంలోనే వాహనాలు బయటకు వచ్చేలా తగిన చర్యలు తీసుకునేలా చర్చిస్తున్నారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.