ETV Bharat / state

'గ్రేటర్​లో నీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్'

భాగ్యనగరంలో నీటి వృథాను తగ్గించేందుకు అధికారులు వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. ఇకపై నీరు ఎక్కువగా వృథా చేసే ఇంటికి నల్లా కనెక్షన్​ తొలగించాలని నిర్ణయించారు. అంతే కాకుండా నీటి వాడకం, ఇంకుడు గుంతల ఏర్పాటు వంటి అంశాలను బట్టి ఇళ్లకు రంగులతో కూడిన గుర్తులను కేటాయించనున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం, నీటి వృథాను అరికట్టడం వంటి అంశాలపై జీహెచ్​ఎంసీ కమిషనర్​ చందానగర్​లోని పలు ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు.

author img

By

Published : Aug 23, 2019, 4:31 PM IST

Updated : Aug 23, 2019, 5:10 PM IST

దానకిశోర్​ పర్యటన

హైదరాబాద్​ చందానగర్​ పరిధిలోని స్టాలిన్​నగర్​, ప్రశాంత్​నగర్​, ఎంఏ నగర్​లలో వాటర్​ వర్క్స్​ ఎండీ, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ పర్యటించారు. నీటి వృథా అవగాహన, సాఫ్​ హైదరాబాద్​ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి నీటి వృథాను అరికట్టడం, తడి, పొడి చెత్తను వేరుచేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్​ కమిషనర్​ హరిచందన, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జీహెచ్​ఎంసీ వినూత్న కార్యక్రమం

భాగ్యనగరంలో నీటి వృథాను అరికట్టడానికి జీహెచ్​ఎంసీ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై నీరు ఎక్కువగా వృథా చేసే ఇంటికి నల్లా కనెక్షన్​ తొలగించాలని నిర్ణయించారు. నీటి వాడకంపై ప్రతి ఇంటికి రంగులతో గుర్తులను వేయనున్నారు. ఎక్కువగా నీరు వృథా చేసే ఇళ్లకు ఎరుపురంగు, నీరు పొదుపు చేస్తూ... ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు నీలం రంగు, ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు ఆకుపచ్చ రంగును గుర్తులుగా వేయనున్నారు.

నీటి వృథా అరికట్టేందుకు జీహెచ్​ఎంసీ కమిషనర్​ అవగాహన

ఇదీ చూడండి : 'స్వచ్ఛభారత్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

హైదరాబాద్​ చందానగర్​ పరిధిలోని స్టాలిన్​నగర్​, ప్రశాంత్​నగర్​, ఎంఏ నగర్​లలో వాటర్​ వర్క్స్​ ఎండీ, జీహెచ్​ఎంసీ కమిషనర్​ దానకిశోర్​ పర్యటించారు. నీటి వృథా అవగాహన, సాఫ్​ హైదరాబాద్​ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికీ తిరిగి నీటి వృథాను అరికట్టడం, తడి, పొడి చెత్తను వేరుచేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్​ కమిషనర్​ హరిచందన, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జీహెచ్​ఎంసీ వినూత్న కార్యక్రమం

భాగ్యనగరంలో నీటి వృథాను అరికట్టడానికి జీహెచ్​ఎంసీ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇకపై నీరు ఎక్కువగా వృథా చేసే ఇంటికి నల్లా కనెక్షన్​ తొలగించాలని నిర్ణయించారు. నీటి వాడకంపై ప్రతి ఇంటికి రంగులతో గుర్తులను వేయనున్నారు. ఎక్కువగా నీరు వృథా చేసే ఇళ్లకు ఎరుపురంగు, నీరు పొదుపు చేస్తూ... ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్న ఇళ్లకు నీలం రంగు, ఇంకుడు గుంతలు లేని ఇళ్లకు ఆకుపచ్చ రంగును గుర్తులుగా వేయనున్నారు.

నీటి వృథా అరికట్టేందుకు జీహెచ్​ఎంసీ కమిషనర్​ అవగాహన

ఇదీ చూడండి : 'స్వచ్ఛభారత్​లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి'

Intro:స్లగ్: TG_KRN_42_23_SEVA VARSHIKOSTAVAM_MINISTER_AVB_TS10038
రిపోర్టర్: లక్ష్మణ్, 8008573603
సెంటర్: పెద్దపల్లి
యాంకర్: నిస్సహాయుల పట్ల ప్రతి ఒక్కరూ సేవా భావంతో మెలగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని సత్యసాయి నిత్య అన్నదాన సేవ పథకం కేంద్రం మొదటి వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇతరుల పట్ల శివ భావంతో మెలగడం గొప్ప విషయమన్నారు సమాజంలో ఎంతోమంది అనాధలు ఒక పూట తిండి కూడా తినలేక పోతున్నారని పేర్కొన్నారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సామాజిక సేవకులు కేవలం సేవ కోసమే తాపత్రేయ పడతారని, రాజకీయ నాయకులు మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.
బైట్: కొప్పుల ఈశ్వర్ సంక్షేమ శాఖ మంత్రి ఇ


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
Last Updated : Aug 23, 2019, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.