ETV Bharat / state

నిర్లక్ష్యం చేశారు... ప్రాణాలు తీశారు..!

author img

By

Published : Sep 6, 2019, 11:02 AM IST

గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ విద్యార్థిని ప్రాణం పోయింది. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఆస్పత్రిలో చేరగా... అర్ధరాత్రి రెండు గంటల వరకు ఎవరూ పట్టించుకోలేరని అందువల్లే తమ కూతురు చనిపోయిందని మృతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నిర్లక్ష్యం చేశారు... ప్రాణాలు తీశారు..!

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​కి చెందిన సతీష్​ మొదటి భార్య రెండో కూతురు అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రాఖీ పండగకు ఇంటికి వచ్చిన సుప్రియ అనారోగ్యంతో మంచాన పడింది. ప్రైవేటు ఆస్పత్రులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నిన్న ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆస్పత్రిలో చేర్పించినా... రాత్రి వరకు ఎవరూ సుప్రియను పట్టించుకోలేదు. రాత్రి ఒంటి గంట సమయంలో కూతురు అచేతనంగా పడి ఉండటం వల్ల సతీష్ సిబ్బంది వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. స్పందించిన సిబ్బంది సుప్రియను పరీక్షించారు. సుప్రియ శ్వాస తీసుకోవడం లేదని ఎమర్జెన్సీ వార్డుకి తరలించి ఆక్సిజన్ అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికే సుప్రియ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో చికిత్స చేస్తే... తమ పాప బతికేదని వాపోయారు.

నిర్లక్ష్యం చేశారు... ప్రాణాలు తీశారు

ఇవీ చూడండి: అర్ధనగ్నంగా కోహ్లీ..! నెటిజన్ల సెటైర్లు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​కి చెందిన సతీష్​ మొదటి భార్య రెండో కూతురు అడ్డగుట్ట ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రాఖీ పండగకు ఇంటికి వచ్చిన సుప్రియ అనారోగ్యంతో మంచాన పడింది. ప్రైవేటు ఆస్పత్రులు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. నిన్న ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆస్పత్రిలో చేర్పించినా... రాత్రి వరకు ఎవరూ సుప్రియను పట్టించుకోలేదు. రాత్రి ఒంటి గంట సమయంలో కూతురు అచేతనంగా పడి ఉండటం వల్ల సతీష్ సిబ్బంది వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. స్పందించిన సిబ్బంది సుప్రియను పరీక్షించారు. సుప్రియ శ్వాస తీసుకోవడం లేదని ఎమర్జెన్సీ వార్డుకి తరలించి ఆక్సిజన్ అందించినా ఫలితం లేకపోయింది. అప్పటికే సుప్రియ చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో చికిత్స చేస్తే... తమ పాప బతికేదని వాపోయారు.

నిర్లక్ష్యం చేశారు... ప్రాణాలు తీశారు

ఇవీ చూడండి: అర్ధనగ్నంగా కోహ్లీ..! నెటిజన్ల సెటైర్లు

Intro:సికింద్రాబాద్ : హైద్రాబాద్ శంషాబాద్ లో ఉంటున్న సతీష్ కు ఇద్దరు భార్యలు..మొదటి భార్య చనిపోయింది ...మొదటి భార్యకు 4 గురు కూతుళ్లు....రెండో భార్యకు 3 గురి సంతానం....మొదటి భార్య రెండో కూతురు సుప్రియ అడ్డగుట్ట ప్రభుత్వ స్కూల్ లో పదవ తరగతి చదువుతుంది...రాఖీ పండుగకు ఇంటికి వెళ్లిన సుప్రియ...అనారోగ్యం తో మంచాన పడింది...ఊరు వాతావరణం సరిగ్గా లేక ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన ఫలితం లేకపోయింది...నిన్న సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ గాంధీ లో అడ్మిట్ చేశారు...3 వ అంతస్తులో మెడికల్ వార్డు లో చికిత్స పొందుతున్న సుప్రియ మధ్యరాత్రి 2 గంటలకు కన్ను మూసింది... ముమ్మాటికీ గాంధీ వైద్యుల నిర్లక్ష్యం...సాయంత్రం అడ్మిట్ అయిన సుప్రియను మధ్య రాత్రి వరకు కూడా వైద్యులు గాని నర్సులు పక్కన పడేశారు... ఆగ్రహం తో ఉన్న సుప్రియ కుటుంబీకులు నర్సులపై ఆగ్రహం చేయడం తో మధ్య రాత్రి 1 గంట సమయం లో ఓ మహిళ వైద్యురాలు సుప్రియ ను నాడీ పట్టుకొని చూడగా శ్వాశ తీసుకోవడం లేదని ఇసియు లో అడ్మిట్ చేసి ఆక్సీజన్ పెట్టిన ఫలితం దక్కలేదు...మధ్య రాత్రి 2 గంటలకు చికిత్స పొందుతు చనిపోయింది...సాయంత్రం సమయం లో సూరియకు సకాలంలో వైద్యం చేస్తే బతికిబుందేదని కుటుంబీకులు చెబుతున్నారు..ఆ సమయంలో నైట్ డ్యూటీ లో ఉన్న RMO 2 ...డాక్టర్ మాధురి కి చెప్పిన పట్టించుకోలేదు.....గాంధీ లో ఇంతకంటే నిర్లక్ష్యం మరొకటి లేదు....మృత దేహాన్ని శంషాబాద్ కి తీసుకెళ్లారు......ఈరోజు ఊరిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.