సంచలనం రేపిన కార్తీక్ హత్య కేసులో మరో ఆరుగురిని అరెస్ట్ చేసి... రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 29న కార్తీక్ అనే వ్యక్తిని హత్యచేసి కొండపల్లి సమీపంలోని నెట్టెంపాడు కాలువలో పూడ్చిపెట్టారు.
ఈ హత్యోదంతంలో బోయ వీరేశ్, బండి సునీల్, కురువ రంజిత్, బోయ రాజేశ్, తెలుగు భీమ్లను తాజాగా అరెస్ట్ చేసినట్లు గద్వాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తొలుత రవి, వసంత్, అనిల్ అనే ముగ్గుర్ని అరెస్టు చేశారు. మొత్తం తొమ్మిది మందిని రిమాండ్కు తరలించామన్నారు. మరో మైనర్ బాలున్ని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : రొమాంటిక్ క్రైమ్ కథ: ఓ ప్రియుడిని మరో ప్రియుడితో చంపించింది..