హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల రేపటి నుంచి రెండు రోజుల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1 కోదండపూర్, నాసర్లపల్లి, గొడకండ్ల గ్రామాల వద్ద గల పంప్హౌస్లలో 600 ఎమ్ఎమ్ డయా పైపులైన్ పై వాల్వులు అమర్చడం, 300 ఎమ్ డయా పైపులైన్ లీకేజీని అరికట్టడం కోసం పనులు జరుగుతున్నట్లు జలమండలి తెలిపింది.
కేడీడబ్యూఎస్పీ ఫేజ్-1 కోదండపూర్ నుంచి గొడకండ్ల వరకు గల పైపులైన్కు పలు ప్రాంతాల్లో మరమ్మతులు వంటి తదితర పనులను చేపడుతుండడం వల్ల మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తంగా 36 గంటలు పాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మిరాలం, కిషన్బాగ్, బాల్ షెట్టికేత్, అల్జుబైల్ కాలనీ, అలియాబాద్, హషమాబాద్, రియాసత్ నగర్, సంతోశ్నగర్, వినయ్నగర్, సైదాబాద్, ఆస్మాన్ గఢ్, దిల్సుఖ్నగర్, చంచల్ గూడ, యాకుత్ పుర, మెహబూబ్ మాన్షన్, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, హిందీనగర్, నారాయణగూడ, అడిక్ మెట్, శివంరోడ్, చిలకలగూడ రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఉంటున్నందున ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: సామాన్యులకు షాక్- మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర