ETV Bharat / state

ఆర్డినెన్స్​ స్థానంలో తీసుకొచ్చిన బిల్లులపై చర్చ

author img

By

Published : Sep 10, 2020, 5:01 AM IST

ఆర్డినెన్స్​ల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులపై గురువారం శాసనసభలో చర్చ జరగనుంది. కొత్తూరు పురపాలిక ఏర్పాటు నేపథ్యంలో కొత్తూరు, తిమ్మాపూర్ గ్రామాపంచాయతీల తొలగింపు కోసం ముసాయిదా నోటిఫికేషన్​ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ ముందు ఉంచుతారు.

ఆర్డినెన్స్​ స్థానంలో తీసుకొచ్చిన బిల్లులపై చర్చ
ఆర్డినెన్స్​ స్థానంలో తీసుకొచ్చిన బిల్లులపై చర్చ

ఆర్డినెన్స్​ల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులపై గురువారం శాసనసభలో చర్చ జరగనుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, విపత్కర సమయాల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత, ఆయుష్ వైద్యుల పదవీవిరమణ వయస్సు పెంపు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అదనపు అప్పులు తీసుకునేలా ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్​లు తీసుకొచ్చింది. వాటి స్థానంలో బిల్లులపై గురువారం అసెంబ్లీలో చర్చించనున్నారు.

కొత్తూరు పురపాలిక ఏర్పాటు నేపథ్యంలో కొత్తూరు, తిమ్మాపూర్ గ్రామాపంచాయతీల తొలగింపు కోసం ముసాయిదా నోటిఫికేషన్​ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ ముందు ఉంచుతారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పామాయిల్ సాగు, ఆసరా ఫించన్లు, తండాలు పంచాయతీలుగా మార్చడం, సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్యకళాశాల, విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీ అంశాలు చర్చకు రానున్నాయి.

కరోనా వైరస్​పై శాసనపరిషత్తులో స్వల్పకాలిక చర్చ జరగనుంది. కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో ఫాస్ట్ ట్యాగ్ విధానం, మక్కా మసీదు ఆధునీకరణ, ప్రభుత్వ ఉద్యోగులు-ఉపాధ్యాయులకు ఎల్టీసీ సౌకర్యం పునరుద్ధరణ, పరిశ్రమల కోసం రంగారెడ్డి జిల్లాలో భూముల సేకరణ, చెన్నూర్ సమీపంలో గోదావరిపై వంతెన నిర్మాణం, బాలానగర్ పారిశ్రామిక భూముల రిజిస్ట్రేషన్ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్​

ఆర్డినెన్స్​ల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులపై గురువారం శాసనసభలో చర్చ జరగనుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, విపత్కర సమయాల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత, ఆయుష్ వైద్యుల పదవీవిరమణ వయస్సు పెంపు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అదనపు అప్పులు తీసుకునేలా ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్​లు తీసుకొచ్చింది. వాటి స్థానంలో బిల్లులపై గురువారం అసెంబ్లీలో చర్చించనున్నారు.

కొత్తూరు పురపాలిక ఏర్పాటు నేపథ్యంలో కొత్తూరు, తిమ్మాపూర్ గ్రామాపంచాయతీల తొలగింపు కోసం ముసాయిదా నోటిఫికేషన్​ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ ముందు ఉంచుతారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పామాయిల్ సాగు, ఆసరా ఫించన్లు, తండాలు పంచాయతీలుగా మార్చడం, సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్యకళాశాల, విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీ అంశాలు చర్చకు రానున్నాయి.

కరోనా వైరస్​పై శాసనపరిషత్తులో స్వల్పకాలిక చర్చ జరగనుంది. కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో ఫాస్ట్ ట్యాగ్ విధానం, మక్కా మసీదు ఆధునీకరణ, ప్రభుత్వ ఉద్యోగులు-ఉపాధ్యాయులకు ఎల్టీసీ సౌకర్యం పునరుద్ధరణ, పరిశ్రమల కోసం రంగారెడ్డి జిల్లాలో భూముల సేకరణ, చెన్నూర్ సమీపంలో గోదావరిపై వంతెన నిర్మాణం, బాలానగర్ పారిశ్రామిక భూముల రిజిస్ట్రేషన్ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

ఇదీ చదవండి: కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.