ETV Bharat / state

కార్మికుల నిధులు అటెలా మళ్లిస్తారు: రాములు నాయక్

భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు బదిలీ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హెచ్​ఆర్సీని ఆశ్రయించారు. సర్కార్ తరలించిన రూ.1000 కోట్లను కార్మికులకే చెందేలా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

author img

By

Published : Jun 8, 2020, 4:29 PM IST

నిధులు కార్మికులకే చెందేలా చూడాలి : రాములు నాయక్
నిధులు కార్మికులకే చెందేలా చూడాలి : రాములు నాయక్

రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు చెందిన రూ.1000 కోట్ల నిధులను మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వంపై సమగ్ర విచారణ చేయించాలని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. కరోనా నేపథ్యంలో కేంద్రం వెసులుబాటు ఇస్తూ 29 రాష్ట్రాలకు గైడ్ లైన్స్ జారీ చేసిందని.. ఆ రాష్ట్రాలు భవన నిర్మాణ కార్మికుల బోర్డు సంక్షేమ నిధి నుంచి డబ్బులు తీసుకుందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

నిధులు కార్మికులకే చెందేలా చూడాలి : రాములు నాయక్

సంక్షేమ నిధులు కార్మికులకే అందాలి..

రాష్ట్ర ప్రభుత్వం వేయ్యి కోట్ల రూపాయలు డ్రా చేసిందని.. కార్మికులకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పౌర సరఫరాల శాఖకు ఏకపక్షంగా బదిలీ చేసిందన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆ డబ్బులు కార్మికులకే చెందాలన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బోర్డు విభజన కాకుండా ప్రభుత్వం ఎలా డ్రా చేసుకుంటుందని రాములు ప్రశ్నించారు. తక్షణమే ఆ నిధులను కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలని కమిషన్​కు విజ్ఞప్తి చేశారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిందని రాములు నాయక్ వెల్లడించారు.

ఇవీ చూడండి : అవినీతి సొమ్మేనా?.. అ.ని.శా. విచారణకు సుజాత

రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు చెందిన రూ.1000 కోట్ల నిధులను మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వంపై సమగ్ర విచారణ చేయించాలని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. కరోనా నేపథ్యంలో కేంద్రం వెసులుబాటు ఇస్తూ 29 రాష్ట్రాలకు గైడ్ లైన్స్ జారీ చేసిందని.. ఆ రాష్ట్రాలు భవన నిర్మాణ కార్మికుల బోర్డు సంక్షేమ నిధి నుంచి డబ్బులు తీసుకుందని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

నిధులు కార్మికులకే చెందేలా చూడాలి : రాములు నాయక్

సంక్షేమ నిధులు కార్మికులకే అందాలి..

రాష్ట్ర ప్రభుత్వం వేయ్యి కోట్ల రూపాయలు డ్రా చేసిందని.. కార్మికులకు ఒక్క రూపాయి ఇవ్వకుండా పౌర సరఫరాల శాఖకు ఏకపక్షంగా బదిలీ చేసిందన్నారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఆ డబ్బులు కార్మికులకే చెందాలన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో బోర్డు విభజన కాకుండా ప్రభుత్వం ఎలా డ్రా చేసుకుంటుందని రాములు ప్రశ్నించారు. తక్షణమే ఆ నిధులను కార్మికులకు అందేలా చర్యలు తీసుకోవాలని కమిషన్​కు విజ్ఞప్తి చేశారు. కేసు తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేసిందని రాములు నాయక్ వెల్లడించారు.

ఇవీ చూడండి : అవినీతి సొమ్మేనా?.. అ.ని.శా. విచారణకు సుజాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.