ETV Bharat / state

చిరుతను రక్షించిన నెహ్రూ జూపార్క్ అధికారులు - తెలంగాణ వార్తలు

మహబూబ్​నగర్ జిల్లాలో సంచరిస్తున్న చిరుతను పట్టుకున్నట్లు నెహ్రూ జూపార్క్ అధికారులు తెలిపారు. కదలలేని స్థితిలో ఉన్న చిరుతకు ప్రాథమిక చికిత్స అందించి.. హైదరాబాద్​కు తీసుకొచ్చామని వెల్లడించారు. చిరుతకు గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు.

leopard in mahabubnagar, forest departments
మహబూబ్​నగర్​లో చిరుత, నెహ్రూ జూపార్క్
author img

By

Published : Jun 11, 2021, 9:17 AM IST

మహబూబ్​నగర్ జిల్లాలో చిరుత సంచరిస్తుందని అటవీశాఖ అధికారుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే డాక్టర్ రాకేష్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగిందని నెహ్రూ జూపార్క్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొలికొండ మండలం బురుగుపల్లి గ్రామానికి సమీపంలోకి తమ డాక్టర్ల బృందం చేరుకుని రెండేళ్ల నుంచి మగ చిరుతపులి అక్కడే సంచిరిస్తుందని గుర్తించిందని పేర్కొంది. కదలలేని స్థితిలో ఉన్న చిరుతకు మంచినీళ్లు అందించి కాస్త విశ్రాంతి కల్పించి... బోనులోకి పంపించామని అధికారులు తెలిపారు.

మేతకోసం వచ్చిన గేదెలపై చిరుతపులి దాడిచేసిందని స్థానికులు తెలిపారని అన్నారు. చిరుతకు లోపలి గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స అందించి... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ తీసుకొచ్చామన్నారు. వివిధ రకాల మందులతో తక్షణ ఉపశమనం కల్పించేలా చేశామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

మహబూబ్​నగర్ జిల్లాలో చిరుత సంచరిస్తుందని అటవీశాఖ అధికారుల నుంచి సమాచారం వచ్చిన వెంటనే డాక్టర్ రాకేష్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగిందని నెహ్రూ జూపార్క్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కొలికొండ మండలం బురుగుపల్లి గ్రామానికి సమీపంలోకి తమ డాక్టర్ల బృందం చేరుకుని రెండేళ్ల నుంచి మగ చిరుతపులి అక్కడే సంచిరిస్తుందని గుర్తించిందని పేర్కొంది. కదలలేని స్థితిలో ఉన్న చిరుతకు మంచినీళ్లు అందించి కాస్త విశ్రాంతి కల్పించి... బోనులోకి పంపించామని అధికారులు తెలిపారు.

మేతకోసం వచ్చిన గేదెలపై చిరుతపులి దాడిచేసిందని స్థానికులు తెలిపారని అన్నారు. చిరుతకు లోపలి గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారని పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స అందించి... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ తీసుకొచ్చామన్నారు. వివిధ రకాల మందులతో తక్షణ ఉపశమనం కల్పించేలా చేశామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: Rythubandhu: రైతుబంధు కోసం మరో రూ.3 వేల కోట్ల రుణం తీసుకోనున్న ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.